రభసకు వినాయక్ వాయిస్ ఓవర్?

కాస్త ఫేమస్ పర్సన్ల చేత వాయిస్ ఓవర్ చెప్పించడం అన్నది సినిమాలకు ఫ్యాషన్ అయింది. మహేష్, రవితేజ,సునీల్ ఇలా చాలామందే వున్నారు ఇలా చెప్పే జాబితాలో. దర్శకుడు కూడా ఒకటి రెండు సార్లు మాట…

కాస్త ఫేమస్ పర్సన్ల చేత వాయిస్ ఓవర్ చెప్పించడం అన్నది సినిమాలకు ఫ్యాషన్ అయింది. మహేష్, రవితేజ,సునీల్ ఇలా చాలామందే వున్నారు ఇలా చెప్పే జాబితాలో. దర్శకుడు కూడా ఒకటి రెండు సార్లు మాట చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తొలిసారి విఖ్యాత దర్శకుడు వివి వినాయక్ చేరారు. తనకు సోదరుడిలాంటి జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆయన గొంతు సవరించుకున్నట్లు తెలిసింది. 

రభస సినిమా కోసం ఆయన ఈ రోజు వాయిస్ ఓవర్ ను డబ్బింగ్ స్టూడియో లో ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తరచు వినయన్న అని ప్రస్తావించే వివి వినాయక్ ఇలా వాయిస్ ఓవర్ చెప్పడం ఇదే తొలిసారి కావచ్చు. రభస 29న జనం ముందుకు వస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మాత. సమంత, ప్రణీత నాయికలు. కందిరీగ శ్రీనివాస్ దర్శకుడు.