చరణ్ కోసం కంచె వెన్యూ మారింది

కంచె అడియో వెన్యూ మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతోంది. ముందు హైదరాబాద్ అన్నారు. అంతలో ఫలక్ నుమా ప్యాలెస్ పేరు వినిపించింది. కాదు సెకెండ్ వరల్డ్ వార్ కు కనెక్టింగ్ వుంటుంది, విశాఖలో చేస్తారు…

కంచె అడియో వెన్యూ మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతోంది. ముందు హైదరాబాద్ అన్నారు. అంతలో ఫలక్ నుమా ప్యాలెస్ పేరు వినిపించింది. కాదు సెకెండ్ వరల్డ్ వార్ కు కనెక్టింగ్ వుంటుంది, విశాఖలో చేస్తారు అని అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వెన్యూ హైదరాబాద్ కు మారింది అని వినికిడి. 

ఈసారి పక్కా అని, దీనికి కారణం, రామ్ చరణ్ తేజ అని వినిపిస్తోంది. అడియో ఫంక్షన్ కు చిరంజీవి వస్తారని మొదట్లో అనుకున్నారు. కానీ ఆయన రావడం లేదని తెలుస్తోంది. ఆయన బదులుగా చెర్రీ హాజరవుతాడట. 

అయితే విశాఖ అంటే రావడం ప్రాబ్లమ్ అవుతుందని, బ్రూస్ లీ సినిమా హడావుడిగా జరుగుతోందని, అదే హైదరాబాద్ అయితే ఒకె అని చెర్రీ అన్నాడని వినికిడి. దాంతో ఇప్పుడు ఫైనల్ గా కంచె అడియో వెన్యూ హైదరాబాద్ ఫిక్సయింది.