మాట నెగ్గించుకొన్న ఎన్టీఆర్‌

క‌థానాయిక‌ల ఎంపిక విష‌యంలో ద‌ర్శకుడిదే తుది నిర్ణయం అయినా… హీరోగారి మాటా చెల్లుబాటు అవ్వాల్సిందే. కొన్ని కొన్ని సార్లు క‌థానాయిక ఎంపిక ని హీరోలు మ‌రీ ప‌ర్సన‌ల్‌గా తీసుకొంటారు. ఎన్టీఆర్ – పూరి సినిమా…

క‌థానాయిక‌ల ఎంపిక విష‌యంలో ద‌ర్శకుడిదే తుది నిర్ణయం అయినా… హీరోగారి మాటా చెల్లుబాటు అవ్వాల్సిందే. కొన్ని కొన్ని సార్లు క‌థానాయిక ఎంపిక ని హీరోలు మ‌రీ ప‌ర్సన‌ల్‌గా తీసుకొంటారు. ఎన్టీఆర్ – పూరి సినిమా విష‌యంలోనూ ఇదే అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోరిక మేర‌కు కాజ‌ల్‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. కాజ‌ల్‌తో న‌టించిన బృందావ‌నం సినిమా బాగా ఆడింద‌ని ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించాడు. 

నిర్మాత గ‌ణేష్ కూడా ఎన్టీఆర్ కోసం భారీ పారితోషికం ఇచ్చి మ‌రీ… కాజ‌ల్‌ని తీసుకొందామ‌నుకొన్నాడు. అయితే పూరి ధ్యాస మాత్రం అలియాభ‌ట్‌పై ప‌డింది. ఈ బాలీవుడ్ క్రేజీ భామ‌ని టాలీవుడ్‌కి దిగుమ‌తి చేద్దామ‌నుకొన్నాడు. అలియాతో సంప్రదింపులు కూడా జ‌రిపాడు. దాంతో పూరి సినిమాలో అలియా భ‌ట్ ఎంట్రీ ఇవ్వబోతోంద‌న్న ప్రచారం జ‌రిగింది. 

అలియా ఎంపిక‌పై ఎన్టీఆర్ అభ్యంత‌రం చెప్పాడ‌ట‌. అలియా కంటే కాజ‌ల్ వెయ్యిరెట్లు బెట‌ర్‌… అని సూచించ‌డాడ‌ట‌. దాంతో కాజ‌ల్ మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చింది. ఈ సినిమాలో కాజ‌ల్ క‌థానాయిక‌గా ఫైన‌లైజ్ అయిపోయింది. అలియా టాలీవుడ్ ఎంట్రీకి ప్రస్తుతానికి బ్రేక్ ప‌డింది. మొత్తానికి ఎన్టీఆర్ త‌న మాట నెగ్గించుకొన్నాడ‌న్నమాట‌.