ఫలక్ నుమాలో కంచె అడియో?

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించిన సినిమా కంచె. క్రిష్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ నటించిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విపరీతమైన అభినందనలు అందుకుంది. ఈ సినిమా అడియో ఈనెల 17…

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించిన సినిమా కంచె. క్రిష్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ నటించిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విపరీతమైన అభినందనలు అందుకుంది. ఈ సినిమా అడియో ఈనెల 17 లేదా 18న జరగబోతోంది.

ఈ అడియోను చాలా గ్రాండ్ లెవెల్ లో జరపాలని దర్శకుడు క్రిష్, నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ మూవీ కాబట్టి, వెన్యూ కూడా అదే విధంగా వుంటే బాగుంటుంది అనుకుంటున్నారట. అందుకని ఫలక్ నుమా ప్యాలెస్ ను వేదికగా చేసుకుంటే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నట్లు వినికిడి.

అయితే ఆ ప్యాలెస్ లో ఇలాంటి ఈవెంట్ చేయడానికి వీలు అవుతుందా లేదా? ఒక వేళ వీలయినా గ్యాదరింగ్ ఏ మేరకు వుంటే సరిపోతుంది అన్నది చూస్తున్నారట. ఇక్కడే ఆ మధ్య సల్మాన్ తన సోదరి  వివాహం చేసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో, కాస్త లిమిటెడ్ గ్యాదరింగ్ తో ఫలక్ నుమాలోనే ఫంక్షన్ చేయాలని క్రిష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం డిసైడ్ అవుతుందో చూడాలి.