మంది ఎక్కువై మూవీ ఆలస్యం?

శ్రీనువైట్ల…నిన్నటి దాకా ఆడింది ఆట..పాడింది పాట..ఇప్పుడు అతి కష్టం మీద రామ్ చరణ్ తో సినిమా ఓకె చేయించుకున్నాడు. కానీ తీరాచేసి సవాలక్ష కండిషన్లు. తనకు నచ్చినా నచ్చకున్నా,ప్రకాష్ రాజ్ తో, కోన వెంకట్…

శ్రీనువైట్ల…నిన్నటి దాకా ఆడింది ఆట..పాడింది పాట..ఇప్పుడు అతి కష్టం మీద రామ్ చరణ్ తో సినిమా ఓకె చేయించుకున్నాడు. కానీ తీరాచేసి సవాలక్ష కండిషన్లు. తనకు నచ్చినా నచ్చకున్నా,ప్రకాష్ రాజ్ తో, కోన వెంకట్ బృందంతో చేతులు కలపక తప్పలేదు. 

దీంతో ఇప్పుడు ఆ సినిమా కథ అంత చురుగ్గా ముందుకు నడవడం లేదని తెలుస్తోంది. కోనవెంకట్ బృందం బాగా బిజీ. ఒక పక్క బాలయ్య సినిమా, మరోపక్క స్వంత సినిమా శంకరాభరణం. ఇంకో పక్క ఈ సినిమా. ఇవి కాక ఇంకా చాలా కమిట్మెంట్లు. అతిశయోక్తి కాదు. కానీ కోన ఆఫీసులో ఏ టైమ్ లో చూసినా కనీసం ఓ నిర్మాత పడిగాపులు పడుతూ వుంటారన్నది టాలీవుడ్ టాక్. 

అలాంటి వాళ్లతో కలిసి ఇప్పుడు శ్రీనువైట్ల స్క్రిప్ట్ తయారు చేయాల్సివచ్చింది. అది అలా నత్తనడక నడుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల యూరప్ వెళ్తారని వినికిడి. అలా వెళ్తే తప్ప సినిమా పట్టాలు ఎక్కిందని నిర్థారణకు రాలేం.