చిరు సినిమా వైనమేమిటి?

చిరంజీవి 150 సినిమా స్టోరీ ఫైనల్ ..ఇదీ ఆ మధ్య బండ్ల గణేష్ ట్వీట్. తరువాత మళ్లీ అంతా సైలెంట్. మచ్చరవి, పూరి కలిసి మాంచి కథ తయారు చేసారని, దానికి చిరు ఆమోద…

చిరంజీవి 150 సినిమా స్టోరీ ఫైనల్ ..ఇదీ ఆ మధ్య బండ్ల గణేష్ ట్వీట్. తరువాత మళ్లీ అంతా సైలెంట్. మచ్చరవి, పూరి కలిసి మాంచి కథ తయారు చేసారని, దానికి చిరు ఆమోద ముద్ర పడిపోయిందని వార్తలు వెలువడ్డాయి. జనాలకు అప్పుడు వచ్చిన ఫస్ట్ అనుమానం..చిరు సినిమాకు నిర్మాత బండ్ల గణేష్ కు సంబంధం ఏమిటి? అని.  

ఎందుకంటే ఆ సినిమాను తానే నిర్మిస్తానని ఎప్పుడో రామ్ చరణ్ చెప్పేసాడు. 150 వ సినిమా కాబట్టి, ప్రెస్టీజియస్ కాబట్టి రామ్ చరణ్ నిర్మించాలనుకుంటున్నాడని వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. మరి ఇప్పుడు ఆ నిర్ణయం ఏమన్నా మారిందా, ప్రాజెక్టు బండ్ల చేతికి వచ్చిందా అని . కానీ బండ్ల ట్వీట్ తరువాత మళ్లీ అంతా సైలెంట్. 

మరి తాజా పరిస్థితి ఏమిటి అంటే..ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్లు వుంది పరిస్థితి అని. కథ పూరికి, బివిఎస్ (మచ్చ)రవికి ఓకె అయింది. చిరుకు కూడా చెప్పారు. ఆయనకు దాదాపు ఓకె.  కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, చిరుకు తెలియకుండా, తొందరపడి ట్వీట్ చేసారన్నది. అది కూడా బండ్ల చేసినట్లే వుంది కానీ, మచ్చరవి హ్యా్ండ్ ఇందులో వుందని. 

పూరి, మచ్చరవి, బండ్ల అందరూ మంచి నేస్తాలు. మరి రవి చెప్పి, ప్రోత్సహించినంత మాత్రాన బండ్ల ఎందుకు ట్వీట్ చేసినట్లు? ఇంతకూ ట్వీట్ చేసాక ఏం జరిగింది? మరి అందరూ ఎందుకు సైలెంట్ అయ్యారు?  ఇవి సమాధానం తెలియాల్సిన ప్రశ్నలు. ఎక్కడో ఏదో జరిగింది. ట్వీట్ చేసిన తరువాత. అది ఏమిటన్నది ముందు ముందు తెలుస్తుంది.

ఇదిలా వుంటే మళ్లీ తాజగా పూరి సినిమాను ఓకె చేయించుకున్నారన్న వార్తలు నిన్నటికి నిన్న బయటకు వచ్చాయి. ఈసారి దీన్ని కెలికింది కూడా పూరీ క్యాంపే.ఆయన పీఆర్వో బిఎ రాజు ఈ విషయం ట్వీట్ చేయడంతో బయటకు వచ్చింది.

అసలు పూరి క్యాంప్ తాము చిరు సినిమా చేస్తున్నామని టామ్ టామ్ వేయడానికి ఎందుకు పదే పదే ప్రయత్నిస్తోంది..మెగా క్యాంప్ మాత్రం ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా వుంటోంది? అదే తెలియాల్సి వుంది.