శృతిహాసన్‌ పర్మినెంట్‌ సెటప్‌

శృతిహాసన్‌కి తెలుగు చిత్ర పరిశ్రమలోనే హీరోయిన్‌గా బ్రేక్‌ దక్కినా, తను తమిళనాడుకి చెందినదైనా కానీ బాలీవుడ్‌ మీదే మోజెక్కువ. బాలీవుడ్‌లోనే నటిగా తొలి అడుగులు వేసిన శృతిహాసన్‌ ఇప్పటికీ అక్కడ సరైన విజయం దక్కించుకోలేదు.…

శృతిహాసన్‌కి తెలుగు చిత్ర పరిశ్రమలోనే హీరోయిన్‌గా బ్రేక్‌ దక్కినా, తను తమిళనాడుకి చెందినదైనా కానీ బాలీవుడ్‌ మీదే మోజెక్కువ. బాలీవుడ్‌లోనే నటిగా తొలి అడుగులు వేసిన శృతిహాసన్‌ ఇప్పటికీ అక్కడ సరైన విజయం దక్కించుకోలేదు. అయినప్పటికీ ఆమెకి బాలీవుడ్‌పై మోజు తగ్గలేదు. 

తెలుగులో తనకి కోట్లు చెల్లించడానికి సిద్ధమైనా, తమిళ సూపర్‌స్టార్స్‌ అంతా తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నా శృతి మాత్రం ముంబయ్‌ మీదే ఫోకస్‌ పెడుతోంది. అందుకే అక్కడే సెటిల్‌ అవ్వాలని డిసైడ్‌ అయింది. ముంబయ్‌లో సొంతంగా ఫ్లాట్‌ కూడా కొనేసుకుంది. అయిదేళ్లుగా ముంబయిలో అద్దె ఇంట్లో ఉంటోన్న శృతి ఎట్టకేలకు అక్కడ ఫ్లాట్‌ కొనుక్కుంది. 

శృతి ఫ్లాట్‌కి ఇంటీరియర్‌ డిజైనర్‌ కూడా తనేనట. తన కలల ఇల్లు ఎలా ఉండాలని అనుకుందో ఆ విధంగా తన విలాసవంతమైన టూ బెడ్రూమ్‌ ఫ్లాట్‌ని శృతిని అలా తీర్చి దిద్దుకుంది. ఎప్పటికైనా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అవుతానని ధీమాగా ఉన్న శృతిహాసన్‌ ఆ కలల్ని ఎంతవరకు సాకారం చేసుకుంటుందో చూడాలి.