హీరో అండ్ విలన్ రెండూనట

చాలా కాలం తరువాత సీనియర్ యాక్టర్ మోహన్ బాబు ఓ సినిమా చేస్తున్నారు. గాయత్రి అనే పేరుతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటిస్తున్నారని, తండ్రీ కూతుళ్ల నడుమ జరిగే కథ…

చాలా కాలం తరువాత సీనియర్ యాక్టర్ మోహన్ బాబు ఓ సినిమా చేస్తున్నారు. గాయత్రి అనే పేరుతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటిస్తున్నారని, తండ్రీ కూతుళ్ల నడుమ జరిగే కథ అని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరో మంచు విష్ణు యంగ్ మోహన్ బాబుగా కనిపిస్తారని కూడా ఆ మధ్య రివీల్ చేసారు.

ఇంతకీ ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమిటంటే, ఈ సినిమాలో మోహన్ బాబు హీరో మాత్రమే కాదు, విలన్ కూడా నంట. అంటే డబుల్ రోల్ అన్నమాట. హీరో, అండ్ విలన్ గా మోహన్ బాబు గాయత్రి సినిమాలో నటిస్తున్నారు. మోహన్ బాబు టాలీవుడ్ ఎంట్రీనే విలన్ గా.

ఆ తరవాత ప్రతిజ్ఞ సినిమాతో హీరోగా మారారు. హీరోగానే కొనసాగుతున్నారు. ఆ తరువాత ఒకటి రెండు నెగిటివ్ క్యారెక్టర్లు వేసినా, అవి సినిమాలో కీలకమైనవి అయితేనే చేసారు. అందువల్ల చాన్నాళ్ల తరువాత హీరోగా చేయడమే కాదు, విలన్ గా చేయడం కూడా గాయత్రి సినిమాతోనే. 

ఈ సినిమా యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, నాగశౌర్యల సినిమాలతో పోటీ పడుతూ ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది.