మరదలి కోసం రకుల్ ప్రీత్ రికమెండేషన్!

తెలుగులో చేతినిండా పుష్కలంగా అవకాశాలతో బిజీగా ఉంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మరో హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం కావడంలో తెరవెనుక భూమిక పోషిస్తోంది. అయితే గియితే తన మరదలు కాగల అమ్మాయిని……

తెలుగులో చేతినిండా పుష్కలంగా అవకాశాలతో బిజీగా ఉంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మరో హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం కావడంలో తెరవెనుక భూమిక పోషిస్తోంది. అయితే గియితే తన మరదలు కాగల అమ్మాయిని… పూరీ జగన్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేయడానికి రకుల్ రికమెండేషన్ చేయడం, దగ్గరుండి అవకాశం ఇప్పించడం విశేషం.

విషయమేంటంటే.. పూరీ జగన్ ప్రస్తుతం తన కొడుకు పూరీ ఆకాశ్ హీరోగా ‘మెహబూబా’ అనే చిత్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించి లోగో లాంచ్ కూడా అయింది. ఈ చిత్రం ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. పూరీ తన కొడుకునే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. పూరీ సినిమాస్ పతాకంపై చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆకాశ్ సరసన నేహా శెట్టి అనే కన్నడ అమ్మాయి హీరోయిన్ గాచేస్తోంది.

అయితే ఇప్పటిదాకా కన్నడ సినిమాల్లో ఏవో అంతగా గుర్తింపు లేని ఒకటిరెండు చిత్రాలు చేసిన ఈ అమ్మాయికి పూరీ బ్యానర్ లో ఈ ఘనమైన అవకాశం దక్కడం వెనుక పెద్ద కథే నడిచింది. ఈ నేహా శెట్టికి అమన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.

అతగాడు.. టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు స్వయానా తమ్ముడు. సో, నేహా శెట్టి అటునుంచి నరుక్కు వచ్చిందన్నమాట. అమన్ సిఫారసుతో రకుల్, రకుల్ సిఫారసుతో పూరీ జగన్ స్పందించి.. మొత్తానికి ఈ చిత్రంలో ఇలా అవకాశం కల్పించారు. కాబోయే మరదలిని హీరోయిన్ గా చేయడానికి రకుల్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నదనే చెప్పాలి.