అయోధ్యకు ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామమందిరం హాట్ టాపిక్ గా మారింది. 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఈ క్రమంలో కొన్ని పుకార్లు కూడా…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామమందిరం హాట్ టాపిక్ గా మారింది. 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఈ క్రమంలో కొన్ని పుకార్లు కూడా హల్ చల్ చేస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హీరో ప్రభాస్ 50 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడనేది ఆ పుకారు. ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులందరికీ భోజనం ఏర్పాట్లు చేసేందుకు ప్రభాస్ ముందుకొచ్చాడని, దీనికి 50 కోట్ల వరకు ఖర్చు అవుతుందనే ప్రచారం సాగుతోంది.

ఆంధ్రాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు స్టేజ్ పై ఈ విషయాన్ని ప్రస్తావించడంతో పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుడీ అంశంపై క్లారిటీ వచ్చింది. రామమందిరం కేంద్రంగా ప్రభాస్ చుట్టూ నడుస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని అతడి టీమ్ స్పష్టం చేసింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రభాస్ కు ఆహ్వానం అందిన విషయాన్ని ఈ సందర్భంగా నిర్థారించింది.

సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్. త్వరలోనే అతడు రాజా సాబ్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. అతడు రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్తాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.