ప‌వ‌న్‌పై అంబ‌టి దిమ్మ తిరిగే సెటైర్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి అంబ‌టి రాంబాబు దిమ్మ తిరిగే సెటైర్ విసిరారు. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపుపై చంద్ర‌బాబుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్న నేప‌థ్యంలో జ‌న‌సేన నోర్మూయించేలా అంబ‌టి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి అంబ‌టి రాంబాబు దిమ్మ తిరిగే సెటైర్ విసిరారు. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపుపై చంద్ర‌బాబుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్న నేప‌థ్యంలో జ‌న‌సేన నోర్మూయించేలా అంబ‌టి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ త‌న చిన్న‌ప్ప‌టి నుంచి వాళ్లిద్ద‌రూ భేటీ అవుతూనే వున్నార‌ని వెట‌క‌రించారు. కానీ ఏదీ తేల‌దు, అవ‌దు అని ఆయ‌న అన్నారు.

అస‌లు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనే నాయ‌కుడు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారో తేల్చుకోగ‌లిగారా? అని మంత్రి అంబ‌టి ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబునాయుడు కుప్పం నుంచేనా, లేక మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారా? అనే విష‌యం తేల్చుకున్నారా? అని అంబ‌టి నిలదీశారు. అది తేలేది కాద‌న్నారు. ఈ లోపు తాము సిద్ధ‌మైన‌ట్టు ఆయ‌న చెప్పారు.

యుద్ధం కూడా అయిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. వైసీపీ గెలిచి అధికారంలోకి వ‌స్తుంద‌ని అంబ‌టి ధీమా వ్య‌క్తం చేశారు. అప్ప‌టి వ‌ర‌కూ వీళ్లిద్ద‌రు సీట్లు తేల్చుకోలేర‌న్నారు. సీట్ల కంటే ముందు నోట్లు తేల్చుకోవాల‌ని ఆయ‌న వ్యంగ్యంగా అన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోట్లు తేల్చుకుంటే త‌ప్ప, సీట్లు తేల‌ని ప‌రిస్థితి అంటూ అదిరిపోయే సెటైర్ విసిరారు. ప‌వ‌న్‌ను న‌మ్ముకున్నోళ్లు కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారి ఈదిన‌ట్టే వుంటుంద‌ని చుర‌క‌లు అంటించారు. ఆయ‌న‌కు ముష్టి సీట్లు ఏవో ఇస్తార‌ని దెప్పి పొడిచారు.  

మూడో, 25 లేదా 30 సీట్లు ముష్టి ప‌డేస్తార‌ని వ్యంగ్యంగా అన్నారు. కానీ క్యాష్ మాత్రం ప‌వ‌న్‌కు బ‌లంగా ఇస్తార‌ని ఆయ‌న ఆరోపించారు. దాని కోస‌మే ప‌వ‌న్ ఎదురు చూస్తున్నార‌ని అంబ‌టి విమ‌ర్శించారు. ప‌వ‌న్‌ను న‌మ్ముకున్నోళ్ల ప‌రిస్థితి ఏంటో ప‌దిరోజుల్లో లేదా నెల‌లోపు తేలిపోతుంద‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు.