తిరుమలలో ప్రత్యక్షమైన హీరోయిన్

హీరోయిన్ సమంత సోషల్ మీడియా పేజీ చూస్తే ఎవరికైనా ఆమె విదేశాల్లో ఉందనే విషయం అర్థమౌతుంది. ఈమధ్య ఓ జ్యూయలరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె థాయ్ లాండ్, మలేషియా దేశాల్లో పర్యటించింది. అక్కడే…

హీరోయిన్ సమంత సోషల్ మీడియా పేజీ చూస్తే ఎవరికైనా ఆమె విదేశాల్లో ఉందనే విషయం అర్థమౌతుంది. ఈమధ్య ఓ జ్యూయలరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె థాయ్ లాండ్, మలేషియా దేశాల్లో పర్యటించింది. అక్కడే ఓ అందమైన జలపాతం కింద బికినీలో దర్శనమిచ్చింది. అంతకంటే ముందు మరికొన్ని దేశాల్లో పర్యటించింది.

ఈమధ్య కాలంలో విదేశాల్లోనే ఎక్కువగా గడిపింది సమంత. మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆమె సినిమాల నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఉన్నఫలంగా తిరుమలలో ప్రత్యక్షమైంది. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సమంత.

ఆమె మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిగా కోలుకుంది. అందుకే స్వామివారికి మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల దర్శించినట్టు చెబుతున్నారు. సో.. ఆమె త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి రాబోతోంది. అయితే స్వామివారిని దర్శించుకున్న అనంతరం, మీడియాతో మాట్లాడ్డానికి ఇష్టపడలేదు సమంత.

ఇప్పటికే ఆమె తను పూర్తిచేసిన వెబ్ సిరీస్ కు సంబంధించి డబ్బింగ్ వర్క్ పూర్తి చేసింది. ఈ గ్యాప్ లో ఆమె ఓ బ్యానర్ స్థాపించింది. ఆ బ్యానర్ పై ఆమె ఓ ప్రాజెక్టు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో పాటు ఓ బడా సినిమాలో హీరోయిన్ గా కూడా నటించబోతోంది. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు బయటకు రాబోతున్నాయి.