రోడ్డు ప్ర‌మాదంలో 14 మంది దుర్మ‌ర‌ణం

క‌ర్నూలు జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 14 మంది దుర్మ‌ర‌ణం చెందారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె నుంచి ఆజ్మీర్ వెళుతున్న టెంపో వాహ‌నాన్ని లారీ ఢీకొన‌డంతో వాళ్ల జీవితాలు తెల్లార‌కుండానే…

క‌ర్నూలు జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 14 మంది దుర్మ‌ర‌ణం చెందారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె నుంచి ఆజ్మీర్ వెళుతున్న టెంపో వాహ‌నాన్ని లారీ ఢీకొన‌డంతో వాళ్ల జీవితాలు తెల్లార‌కుండానే ముగిసిపోయాయి.

క‌ర్నూలు జిల్లా వెల్దుర్తి మండ‌లం మాదాపురం వ‌ద్ద ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. లారీ డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో ఉండ‌డంతో ఈ ఘోరం జ‌రిగింద‌ని స‌మాచారం. 

మృతుల్లో 8 మంది మ‌హిళ‌లు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్న‌ట్టు స‌మాచారం. అలాగే మ‌రికొంద‌రు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు.

పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి  చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా గాయ‌ప‌డిన వారిలో కొంద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. తెల్ల‌వారుజామున ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి వుంది. 

ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్ పాల‌న‌లో ల‌బ్ధిదారులే

షర్మిల సాహసం సఫలం అవుతుందా!