నేవీ ఆఫీసర్ కూతురుపై గ్యాంగ్ రేప్

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ నేవీ అధికారి కూతుర్ని కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారు. వీళ్లలో ఒకడు నేవీ అధికారి ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నాడు. Advertisement విశాఖ 104 ఏరియాలో నివశిస్తున్న…

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ నేవీ అధికారి కూతుర్ని కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారు. వీళ్లలో ఒకడు నేవీ అధికారి ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నాడు.

విశాఖ 104 ఏరియాలో నివశిస్తున్న నేవీ అధికారి కూతురు పదో తరగతి చదువుతోంది. ఆమె ఉంటున్న ఆపార్ట్ మెంట్ లోనే స్కూల్ ఎటెండర్ సత్యారావు కూడా ఉంటున్నాడు. బాలికతో క్లోజ్ గా ఉండే సత్యారావు, మాయమాటలు చెప్పి ఆమెను వశపరుచుకున్నాడు.

ఎవరూ లేని టైమ్ చూసి అమ్మాయిని వివస్త్రను చేశాడు. ఆ తర్వాత తన మొబైల్ తో షూట్ చేశాడు. ఆ వీడియోలతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆ వీడియోల్ని తన స్నేహితులకు పంపించాడు. వాళ్లు కూడా వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి, అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అలా 20 రోజుల పాటు బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. జరిగింది మొత్తం చెప్పింది బాలిక. వెంటనే నేవీ అధికారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, సత్యారావును అదుపులోకి తీసుకున్నారు. మిగతా కామాంధుల కోసం వెదుకుతున్నారు. సత్వర న్యాయం కోసం ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.

మహిళలు, బాలికల విషయంలో తెలిసిన వాళ్లను కూడా నమ్మడానికి వీల్లేదనే విషయాన్ని ఈ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది. బాధిత బాలికకు కేజీహెచ్ లో వైద్యపరీక్షలు నిర్వహించారు.