మంత్రి ప‌ద‌వి పోగొట్టుకున్న నేత‌ల‌కు జ‌గ‌న్ భరోసా ఇది!

ఇటీవల మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో ప‌ద‌వులు పోగొట్టుకున్న నేత‌ల‌కు జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్ర‌క‌టించిన…

ఇటీవల మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో ప‌ద‌వులు పోగొట్టుకున్న నేత‌ల‌కు జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్ర‌క‌టించిన జిల్లా అధ్య‌క్షుల జాబితాలో.. మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి.

శ్రీ స‌త్య‌సాయి జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మితం అయిన మాల‌గుండ్ల శంక‌ర్ నారాయ‌ణ ఇటీవ‌లే కేబినెట్ బెర్త్ ను కోల్పోయారు. గుంటూరు జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మితం అయిన మేక‌తోటి సుచ‌రిత‌ది ఇదే ప‌రిస్థితి అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులుగా నియ‌మితం అయ్యారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుల‌య్యారు పేర్ని నాని. ఏలూరు జిల్లా అధ్య‌క్షులుగా ఆళ్ల నాని నియ‌మితం అయ్యారు. ధ‌ర్మాన కృష్ణ‌దాస్ శ్రీకాకులం జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మితం అయ్యారు. 

మంత్రి వ‌ర్గం లో కొన‌సాగింపు పొంద‌లేక‌పోయిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను ఇలా జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మించి వారికి కాస్త భ‌రోసాను ఇచ్చిన‌ట్టుగా ఉన్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.