ప్రచారం కోసమే వివాదం రేపారా..?

రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఇద్దరూ కోర్టు మెట్లు ఎక్కారు. ఆ వివాదం ఏ మలుపు తిరుగుతుందా అని ఓ సెక్షన్ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Advertisement…

రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఇద్దరూ కోర్టు మెట్లు ఎక్కారు. ఆ వివాదం ఏ మలుపు తిరుగుతుందా అని ఓ సెక్షన్ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతలోనే అంతా సద్దుమణిగిపోయింది. లావణ్య సడెన్ గా సైలెంట్ అయింది. రాజ్ తరుణ్ తన సినిమాల పనిలో పడిపోయాడు. డైలీ సీరియల్ లా సాగిన కాంట్రవర్సీ, ఒక్కసారిగా ఆగిపోయింది..

దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. అటు వైపు నుంచి ఎందుకు సైలెంట్ అయ్యారో తనకు తెలియదనే అర్థం వచ్చేలా రియాక్ట్ అయ్యాడు. అప్పుడు, ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నానని అన్నాడు.

వరుసగా సినిమాలొస్తున్నాయి కాబట్టి ఎటెన్షన్ కోసం లావణ్య ఇష్యూను రాజ్ తరుణ్ తెరపైకి తెచ్చాడనే ప్రచారం కూడా నడుస్తోంది. తన సినిమాల ప్రచారం కోసం, రాజ్ తరుణ్ కావాలని లావణ్యతో కలిసి కాంట్రవర్సీ చేశాడంటున్నారు కొంతమంది.

అసలు ఈ ప్రచారాన్ని జీర్ణించుకోవడానికే తనకు చాలా టైమ్ పడుతుందన్నాడు రాజ్ తరుణ్. అంత వివాదాస్పదంగా ఎవ్వరూ ప్రచారం చేయరని, లావణ్యతో వివాదానికి తన సినిమాలకు ఎలాంటి సంబందం లేదని అన్నాడు.

వారాల గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ చేసిన రాజ్ తరుణ్, ఇప్పుడు తన మూడో సినిమా ‘భలే ఉన్నాడే’ సినిమాను కూడా విడుదలకు సిద్ధం చేశాడు. ఈ సందర్భంగా అతడు మరోసారి మీడియాను ఫేస్ చేశాడు.

7 Replies to “ప్రచారం కోసమే వివాదం రేపారా..?”

Comments are closed.