ఖుషి-2 కథ పవన్ కల్యాణ్ దగ్గరే ఉందంట!

పవన్ కల్యాణ్ తో ఖుషి-2 చేయాలంటూ నిండు సభలో హీరోయిన్ ప్రియాంక మోహన్.. పవన్ ఫ్యాన్స్ అందరి తరఫున ఎస్ జే సూర్యను అడిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించాడు ఎస్ జే…

పవన్ కల్యాణ్ తో ఖుషి-2 చేయాలంటూ నిండు సభలో హీరోయిన్ ప్రియాంక మోహన్.. పవన్ ఫ్యాన్స్ అందరి తరఫున ఎస్ జే సూర్యను అడిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించాడు ఎస్ జే సూర్య. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. ఖుషి-2 కథ ఇప్పటికీ పవన్ దగ్గరే ఉందంట.

“ఖుషి-2 అనే ఒక స్టోరీ పవన్ దగ్గరే ఉంది. కాకపోతే టైటిల్ వేరేది పెట్టాను. ఆయన ఆ స్టోరీ నెరేషన్ చాలా ఎంజాయ్ చేశారు. ఆ కథ కూడా ఆయనే తీసుకున్నారు. కాకపోతే, చేయనని చెప్పేశారు. ఆ తరహా కథలు చేసే మైండ్ సెట్ ఇప్పుడు లేదు, నేను హీరోయిన్ ను లవ్ చేయడం లాంటి కథలు ఇప్పుడు వద్దు, ఆ ఫేజ్ దాటిపోయానని అన్నారు.”

పవన్ వద్దన్నప్పటికీ ఎస్ జే సూర్య నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడట. అయినప్పటికీ పవన్ ససేమిరా అన్నారట.

“తమిళనాట ఎంజీఆర్ గురించి చెప్పాను. ఆయన పెద్ద హీరో అయిన తర్వాత కూడా మంచి లవ్ సినిమాలు చేశారని చెప్పాను. అలా పవన్ ను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ పవన్ ఒప్పుకోలేదు. ఖుషి-2 పవన్ చేసినట్టయితే బ్రహ్మాండంగా ఉండేది. నాకు ఆ బాధ ఇప్పటికీ ఉంది.”

ఇప్పుడున్న హీరోల్లో ఖుషి-2 సబ్జెక్ట్ కు తెలుగులో నాని, రామ్ చరణ్ సరిపోతారని అన్నాడు ఎస్ జే సూర్య. ఇక తమిళ్ లో విజయ్ తో చేస్తే బాగుంటుందన్నాడు.

6 Replies to “ఖుషి-2 కథ పవన్ కల్యాణ్ దగ్గరే ఉందంట!”

Comments are closed.