హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల‌కు ఇంకా క‌ష్టాలు తీర‌డం లేదు. మూడు రోజులుగా వ‌ర‌ద నీటిలో గ‌డుపుతూ ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిరాశ్ర‌యుల ఆక‌లిద‌ప్పులు తీర్చ‌డానికి స‌హాయ‌క చ‌ర్య‌ల్ని వేగ‌వంతం…

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల‌కు ఇంకా క‌ష్టాలు తీర‌డం లేదు. మూడు రోజులుగా వ‌ర‌ద నీటిలో గ‌డుపుతూ ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిరాశ్ర‌యుల ఆక‌లిద‌ప్పులు తీర్చ‌డానికి స‌హాయ‌క చ‌ర్య‌ల్ని వేగ‌వంతం చేసింది.

ఇందులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ల‌లేని ప్రాంతాల్లోని నిరాశ్ర‌యుల‌కు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. ఐదు హెలీకాఫ్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేప‌ట్టిన‌ట్టు సీఎం చంద్ర‌బాబుకు అధికారులు వివరించారు. హెలికాఫ్టర్, పడవ, ట్రాక్టర్ల ద్వారా ఇవాళ్టి ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా వుండ‌గా విజయవాడలో 36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులు పూర్తిస్థాయిలో ఆహారం, నీళ్లు, పాలు, ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు కావాల్సిన‌వి పంపణీ చేయాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఏ ఒక్క నిరాశ్ర‌యుడు త‌మ‌కు ఆహారం అంద‌లేద‌నే మాట వినిపించ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు ఆదేశాలు ఇచ్చారు.

చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన‌ప్పుడు, త‌మ గోడు వెల్ల‌బోసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ల‌లేక‌పోయాయి. అలాంటి ప్రాంతాల్లోని వ‌ర‌ద బాధితుల‌కు ఎలాగైనా ఆహారం, నీళ్లు త‌క్ష‌ణావ‌స‌రంగా అందించాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రించిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఏది ఏమైనా బాధితుల ఆక‌లి తీర్చ‌డం అభినంద‌నీయం.

7 Replies to “హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ”

  1. జగన్ మీద ప్రజల అంత ఆగ్రహం ఉంటుందని, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన కారణాలలో ఒకటి కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై. ప్రజలు ఈ కుల విద్వేషాలపై విసుగు చెంది, జగన్ కోసం ఓట్లు వేసే బదులు, ఈ కుల విద్వేషాలను ప్రోత్సహిస్తున్న జగన్ పార్టీపై మరింత ద్వేషం పెంచుకున్నారు.

    ఇంకో పెద్ద సమస్య అమరావతి రాజధాని అంశం. ప్రజలు తమకు కావలసిన పాఠాలు నేర్చుకున్నారు, కానీ కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అనుచరులు తమ సొంత పార్టీకి హాని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ ద్వేష వ్యాపారం వల్ల. పార్టీ నిలబడాలంటే కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం తక్షణమే ఆపాలి. వైసీపీ అనుచరులు పెద్దవాళ్లలా ఆలోచించాలి, మంచి మనుషులుగా మారండి, విభజనల్ని ప్రోత్సహించడం మానుకోండి.

  2. వైజాగ్ వాసుల్లా కాకుండా విజయవాడ వాళ్ళు తీసుకున్న వాళ్ళే మల్లి మళ్ళీ తీసుకోవడం వాళళ్ శివారు ప్రాంతం వాళ్ళు ఆకలితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది బాధాకరం.

Comments are closed.