రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలు ఇచ్చాం

రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఈరోజు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రాజ్-లావణ్య పదేళ్లు సహజీవనం చేశారని అందులో పేర్కొన్నారు. దానికి సంబంధించిన…

రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఈరోజు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రాజ్-లావణ్య పదేళ్లు సహజీవనం చేశారని అందులో పేర్కొన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా మరోసారి మీడియా ముందుకొచ్చింది లావణ్య. ఈసారి ఆమె కొత్త ఆరోపణలు చేసింది. వివిధ సందర్భాల్లో రాజ్ తరుణ్ కు లావణ్య తల్లిదండ్రులు ఏకంగా 70 లక్షల రూపాయలిచ్చారంట.

“ఒక టైమ్ లో రాజ్ తరుణ్ ను నేనే పోషించాను. నా తల్లిదండ్రులు రాజ్ తరుణ్ కు డబ్బులిచ్చారు. నా పెళ్లి కోసం కొన్న 2 స్థలాల్ని వాళ్లు అమ్మేసి, ఆ డబ్బును రాజ్ తరుణ్ కు ఇచ్చారు. స్థలాలు అమ్మిన డేట్స్, రాజ్ కు డబ్బులిచ్చిన చెక్ తేదీలు అన్నీ ఉన్నాయి. గతంలో ఓ రెండేళ్లు రాజ్ తరుణ్ సినిమాలు చేయలేదు. ఆ టైమ్ లో అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. కేవలం అద్దె 60వేలు ఉండేది. ఆ టైమ్ లో డబ్బంతా మా తల్లిదండ్రులే పెట్టారు.”

ఇలా పలు సందర్భాల్లో రాజ్ తరుణ్ కు దాదాపు 70 లక్షల రూపాయలిచ్చామని.. వాటికి సంబంధించిన బిల్లులు, పేమెంట్ స్క్రీన్ షాట్స్, చెక్కులు.. ఇలా అన్నీ ఉన్నాయని వాదిస్తోంది లావణ్య. మరోవైపు శేఖర్ భాషాపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

“బిగ్ బాస్ షోలో స్థానం సంపాదించేందుకే శేఖర్ భాషా మా ఇష్యూలోకి దూరాడు. అతడు, అతడి ఆర్మీ కలిసి మా ఇష్యూను వాడుకొని పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ పాపులారిటీతో అతడు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు.”

తన భర్త రాజ్ తరుణ్, తప్పించుకొని తిరుగుతున్నాడని.. ఇప్పటికీ మాల్వి మల్హోత్రానే అతడు సహజీవనంలో ఉన్నాడని ఆరోపిస్తోంది లావణ్. అతడు ఎంత తప్పించుకోవాలని చూసినా, న్యాయం నుంచి మాత్రం తప్పించుకోలేడంటోంది.

4 Replies to “రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలు ఇచ్చాం”

Comments are closed.