కూటమి ప్రభుత్వానికి స్పీకర్ మార్కులు

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో స్వచ్చమైన పాలన సాగుతోందని అన్నారు. ప్రభుత్వ…

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో స్వచ్చమైన పాలన సాగుతోందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని అంటూ గుడ్ గవర్నెస్ ఏపీలో సాగుతుందని మెచ్చుకున్నారు.

ఏపీలో బ్రహ్మాండమైన పాలన చంద్రబాబు అందిస్తున్నారని అయ్యన్న కితాబు ఇచ్చారు. గత ప్రభుత్వ పాలన దోపిడీతో కూడుకుందని అన్నారు. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు అని ఆయన ఫైర్ అయ్యారు.

టీడీపీ కూటమి గెలిచినందుకు విశాఖలోని అమ్మవారికి మొక్కులు స్పీకర్ చెల్లించుకున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొక్కు తీరుస్తాను అని చెప్పాను అని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అమ్మవారికి మొక్కులు తీర్చాను అని అన్నారు.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలు అమరావతి పోలవరం అని ఆయన చెప్పారు. రాజధానిని నిర్మించడమే కాకుండా పోలవరం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. వీటినే కూటమి ప్రభుత్వం లక్ష్యాలుగా పెట్టుకుందని ఆయన అన్నారు.

స్పీకర్ గా మీడియా ముందుకు రావడం బాగా తగ్గించిన అయ్యన్న వచ్చిన ప్రతీ సారీ ధాటీగానే మాట్లాడుతున్నారు. అయితే ఆయన హుందాగానే వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో కీలకమైన రాజ్యాంగ పదవిలో తాను మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అనుకుంటున్నారు. చంద్రబాబు పాలన భేష్ అని ఆయన చెప్పడం ద్వారా సొంత పార్టీ మీద కొంత పక్షపాతం చూపిస్తున్నారు అన్న మాట ఉన్నా చాలా మంది స్పీకర్ల మాదిరిగా మరీ ఓపెన్ గా ఉండడం లేదు అని అంటున్నారు.

2 Replies to “కూటమి ప్రభుత్వానికి స్పీకర్ మార్కులు”

Comments are closed.