చినబాబుకు కితాబు…జేగంట మోగినట్లేనా?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మరీ చినబాబు లోకేష్ బాబుని అభినందించడం రాజకీయంగా విశేషంగానే చెబుతున్నారు. Advertisement టీడీపీలో ఇపుడు…

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మరీ చినబాబు లోకేష్ బాబుని అభినందించడం రాజకీయంగా విశేషంగానే చెబుతున్నారు.

టీడీపీలో ఇపుడు చినబాబు హవా నడుస్తోంది అని ప్రచారం సాగుతోంది. రాజకీయ అనుభవశాలి గంటాకి అది తెలియకుండా ఉండదనే అంటారు. ఆయన సరైన సమయం చూసుకుని మరీ లోకేష్ బాబుని అభినందించారు.

ఆయన లోకేష్ ని కలసి అనేక విషయాలు చర్చించారు. విశాఖలో అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ని ఏర్పాటు చేసే విషయంలో లోకేష్ తీసుకున్న శ్రద్ధ పట్ల పొగడ్తలు కురిపించారు. ఈ కంపెనీ రాక ద్వారా విశాఖలో పది వేల ఉద్యోగాలు వస్తాయని విద్య, ఫార్మా, టూరిజం వంటి రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన లోకేష్ కి చెప్పారు.

విశాఖలో ఫ్లై ఓవర్లు కారిడార్లు వంటి వాటి ఏర్పాటు పట్ల లోకేష్ దృష్టి పెట్టాలని పెద్దాయనగా గంటా కోరినట్లుగా తెలుస్తోంది. గంటా మంత్రి కచ్చితంగా అవుతారని అనుకున్నా అది జరగలేదు, దాంతో ఆయన తనదైన ఆలోచనలతోనే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.

లోకేష్ టీడీపీకి కీలక కేంద్రంగా మారిన నేపథ్యంలో ఆ పరిస్థితులకు అనుగుణంగా గంటా పావులు కదుపుతున్నారని అంటున్నారు.

రానున్న రోజులలో యంగ్ టీం తో రెడీ కావాలని లోకేష్ ఆలోచన. దాంతో దానిని అర్ధం చేసుకున్న వారు అంతా తమ వారసులను ఆ టీం లో ఉండేలా చూసుకుంటున్నారు.

బహుశా గంటా అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నారా అన్నది టీడీపీలో అంతా తర్కించుకుంటున్నారు.

5 Replies to “చినబాబుకు కితాబు…జేగంట మోగినట్లేనా?”

  1. “విశాఖలో ఫ్లై ఓవర్లు కారిడార్లు వంటి వాటి ఏర్పాటు పట్ల లోకేష్ దృష్టి పెట్టాలని పెద్దాయనగా గంటా కోరినట్లుగా తెలుస్తోంది.”

    why hurry? They got time till 2047, by then even the pensioners get 1 lac per month pension. They commute by rope ways, lite rails.

Comments are closed.