భార్యాభర్తలుగా మారిన అలియా భట్, రణబీర్ కపూర్

నాలుగేళ్ల కిందటి వరకు స్నేహితులు.. నిన్నటివరకు ప్రేమికులు.. ఇవాళ్టి నుంచి వీళ్లిద్దరూ భార్యాభర్తలు. బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి చేసుకున్నారు. కొద్దిసేపటి కిందట, ముంబయిలో వీళ్ల వివాహం సింపుల్ గా…

నాలుగేళ్ల కిందటి వరకు స్నేహితులు.. నిన్నటివరకు ప్రేమికులు.. ఇవాళ్టి నుంచి వీళ్లిద్దరూ భార్యాభర్తలు. బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి చేసుకున్నారు. కొద్దిసేపటి కిందట, ముంబయిలో వీళ్ల వివాహం సింపుల్ గా జరిగింది. బంద్రాలోని రణబీర్ కపూర్ నివాసం 'వాస్తు'లో ఈ పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిగింది.

నిన్నట్నుంచే రణబీర్-అలియా వివాహ వేడుక మొదలైంది. ఉదయం 10 గంటలకు పితృ పూజతో ఈ వేడుకను ప్రారంభించారు. ఆ వెంటనే మెహందీ కార్యక్రమం, సాయంత్రం సంగీత్ జరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి అసలైన పెళ్లి తంతులోకి జంట ఎంటరైంది. మధ్యాహ్నం 4 గంటల టైమ్ లో అలియా భట్, రణబీర్ వివాహం జరిగింది.

కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన పెళ్లి ఇది. కరీనా-సైఫ్ మాత్రమే స్టార్స్ గా కనిపించారు. వాళ్లు కూడా బంధువులు కాబట్టి పెళ్లి వేడుకకు వచ్చారు. ఇక బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కరణ్ జోహార్ మాత్రమే. అతడు కూడా పెళ్లికి లేడు. ఓ గంట సేపు ఉండి వెళ్లిపోయాడు.

పెళ్లి వేడుక మొదలైన తర్వాత అలియా నుంచి ఒకే ఒక్క స్టిల్ బయటకొచ్చింది. మెహందీ పెట్టుకున్న అలియా భట్ ఫొటోల్ని, ఆమె స్టయిలిస్ట్ విడుదల చేసింది. అంతకుమించి ఈ పెళ్లికి సంబంధించి ఫొటోలేవీ బయటకు రాలేదు. మరికొద్దిసేపట్లో రణబీర్-అలియా తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సినీ ప్రముఖులకు ఈ వీకెండ్ పార్టీ ఇవ్వబోతున్నారు.