టీడీపీ సభలో అపశృతి.. కిందపడ్డ చింతమనేని, చినరాజప్ప..!

ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారి గూడెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో అపశృతి నెలకొంది. మాజీ మంత్రి నిమ్మకాయల చిన్న‌రాజ‌ప్ప‌ ప్రసంగిస్తుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.  Advertisement దీంతో…

ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారి గూడెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో అపశృతి నెలకొంది. మాజీ మంత్రి నిమ్మకాయల చిన్న‌రాజ‌ప్ప‌ ప్రసంగిస్తుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. 

దీంతో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, చినరాజప్ప, పీతల సుజాత తదితరులు వేదికపై నుంచి కింద పడిపోయారు. వెంట‌నే అక్క‌డే ఉన్న కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్త‌మై వారికి పైకి లేపారు. ఈ ఘ‌ట‌నలో సీనియ‌ర్ నేత‌లు స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

స్టేజ్‌కు మించి నాయ‌కులు కుర్చోవ‌డంతో పాటు.. బ‌లంగా గాలులు వీయ‌డంతో వేదిక కుప్ప‌కూలిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదంలో నాయ‌కులు స్వ‌ల్ప గాయ‌ల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రు ఊపిరి పిల్చుకున్నారు. కాగా ఈ మ‌ధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకుకొని కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతి చెందిన విష‌యం తెలిసిందే.