ఎట్టకేలకు సెట్స్ పైకి అనుష్క

అప్పుడెప్పుడో లాక్ డౌన్ టైమ్ లో కనిపించింది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజైంది. అంతే, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కరోనా వెళ్లిపోయినా అనుష్క మాత్రం తెరపైకి రాలేదు. ఎట్టకేలకు ఆ…

అప్పుడెప్పుడో లాక్ డౌన్ టైమ్ లో కనిపించింది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజైంది. అంతే, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కరోనా వెళ్లిపోయినా అనుష్క మాత్రం తెరపైకి రాలేదు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. బొమ్మాలి మరోసారి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈనెల 4 నుంచి కొత్త సినిమా మొదలుపెడుతోంది.

నవీన్ పొలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ ఓ కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అనుష్క వల్ల ఈ సినిమాపై అనుమానాలు కూడా ఎక్కువయ్యాయి. ఎట్టకేలకు అన్ని పుకార్లకు చెక్ పెడుతూ.. సోమవారం నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.

యూవీ క్రియేషన్స్ నిర్మాతలతో అనుష్కకు మంచి సంబంధాలున్నాయి. గతంలో ఆ బ్యానర్ లో మిర్చి, భాగమతి సినిమాలు చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా ఈ కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతోంది. కెరీర్ లో అనుష్కకు ఇది 48వ సినిమా.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు దర్శకుడు మహేష్. వయసైపోతున్నా పెళ్లంటే ఇంట్రెస్ట్ చూపించని అమ్మాయి పాత్రలో అనుష్క కనిపించబోతోంది.