శ్రీదేవి కూతుర్ని సెట్ చేసిన పూరి?

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు చాలామంది ప్రయత్నించారు. మెహర్ రమేష్ నుంచి నాగార్జున వరకు చాలామంది జాన్విని ట్రై చేశారు. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. మరోవైపు జాన్వి…

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు చాలామంది ప్రయత్నించారు. మెహర్ రమేష్ నుంచి నాగార్జున వరకు చాలామంది జాన్విని ట్రై చేశారు. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. మరోవైపు జాన్వి తండ్రి బోనీకపూర్ మాత్రం, తన కూతురు కచ్చితంగా టాలీవుడ్ ప్రాజెక్టులో నటిస్తుందంటూ ఎప్పటికప్పుడు ఫీలర్లు వదులుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు జాన్వి నటించబోయే తెలుగు ప్రాజెక్టు సెట్ అయ్యేలా ఉంది.

నిన్న లాంఛ్ అయిన జేజీఎం (జనగణమన) ప్రాజెక్టులోకి శ్రీదేవిని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాన్వి కపూర్ ను పూరి జగన్నాధ్ ఒప్పించినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటని జాన్వి కపూర్ టీమ్ ఖండించకపోవడం విశేషం.

తనకు టాలీవుడ్ అంటే ఇష్టమని, మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ సరసన నటించాలని ఉందంటూ గతంలోనే జాన్వి కపూర్ ప్రకటించింది. ఇప్పుడీ జేజీఎంతో అవన్నీ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఈ సినిమా కోసం కెరీర్ హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతోందట జాన్వి.

బాలీవుడ్ భామల్ని సౌత్ కు పరిచయం చేయడం పూరి జగన్నాధ్ కు కొత్త కాదు. కంగన, అనన్య, దిశాపటానీ.. ఇలా చాలామందిని సౌత్ కు తీసుకొచ్చాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి జాన్వి కపూర్ కూడా చేరబోతోందని సమాచారం. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఆ వెంటనే హీరోయిన్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.