భార్య చికెన్ వండలేదని యాసిడ్ తాగాడు

మద్యం సేవిస్తే విచక్షణ కోల్పోతామనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. మద్యం మత్తులో ఉన్న భర్త, భార్యపై కోపంతో విచక్షణ మరిచి యాసిడ్ తాగాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ శివార్లలో జరిగింది ఈ ఘటన.…

మద్యం సేవిస్తే విచక్షణ కోల్పోతామనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. మద్యం మత్తులో ఉన్న భర్త, భార్యపై కోపంతో విచక్షణ మరిచి యాసిడ్ తాగాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ శివార్లలో జరిగింది ఈ ఘటన.

మహబూబ్ నగర్ జిల్లా కేతిరెడ్డి పల్లెకి చెందిన రతన్ లాల్, కుటుంబ పోషణ కోసం తన ఊరి నుంచి హైదరాబాద్ శివార్లలో ఉన్న దుండిగల్ కు మకాం మార్చాడు. రతన్ లాల్, రాధిక దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే రతన్ లాల్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. దాదాపు ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికొస్తాడు.

మొన్న కూడా అలానే మద్యం తాగి ఇంటికొచ్చాడు. వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చాడు. తన కోసం చికెన్ కర్రీ వండాలని డిమాండ్ చేశాడు. కానీ రాధిక మాత్రం కూర వండలేదు. దానికి కారణం కూతురికి అమ్మవారు (చికెన్ పాక్స్) సోకడమే. కూతురికి అమ్మోరు సోకినప్పుడు ఇంట్లో నాన్-వెజ్ వండకూడదని ఎంత చెప్పినా భర్త వినలేదు.

అలానే తిడుతూ పడుకున్న భర్త, పొద్దున్నే లేచి బయటకు వెళ్లిపోయాడు. తను ఆత్మహత్య చేసుకుంటానంటూ తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు. భర్త పరిస్థితి చూసిన రాధిక వెంటనే అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేసింది. చావుబతుకుల మధ్య కొట్టాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు రతన్ లాల్. ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.