ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజల్ల సమీపంలో అనంతపల్లి హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.  Advertisement మృతుల్లో…

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజల్ల సమీపంలో అనంతపల్లి హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.