విజయ్ దేవరకొండతో వివాదంపై అనసూయ స్పందన

విజయ్ దేవరకొండకు, అనసూయకు మధ్య నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇదేదో కొత్తగా మొదలైన కాంట్రవర్సీ కాదు. అర్జున్ రెడ్డి టైమ్ నుంచి నడుస్తోంది. తాజాగా కూడా కొనసాగింది. ఈసారి అనసూయపై విజయ్…

విజయ్ దేవరకొండకు, అనసూయకు మధ్య నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇదేదో కొత్తగా మొదలైన కాంట్రవర్సీ కాదు. అర్జున్ రెడ్డి టైమ్ నుంచి నడుస్తోంది. తాజాగా కూడా కొనసాగింది. ఈసారి అనసూయపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇంకాస్త గట్టిగా, మరింత ఘాటుగా ట్రోలింగ్ కు దిగారు.

ఈ మొత్తం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది అనసూయ. ఇకపై ఆ వివాదం జోలికి వెళ్లనని, ఇక్కడితో ఆ వివాదాన్ని ఆపేస్తున్నానని ప్రకటించింది.

“నా మానసిక ప్రశాంతత కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఓ మహిళను, పైగా పిల్లలకు తల్లిని అయిన నాపై అలాంటి ప్రచారం చేశారనే విషయం తెలిసి బాధేసింది. ఎవరైనా పొద్దున్న లేచినప్పట్నుంచి ఎవరితోనైనా మెప్పు పొందుదామనే ప్రయత్నిస్తాం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికితోడు నాపై ట్రోలింగ్ ను డబ్బులిచ్చి మరీ చేయించారని తెలిసిన తర్వాత చాలా బాధేసింది. అందుకే మానసిక ప్రశాంతత కోసం ఇక ఆ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని నిర్ణయించుకున్నాను”.

విమానం అనే సినిమా ప్రచారం కోసం ఈరోజు మీడియా ముందుకొచ్చింది అనసూయ. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేసింది. వివాదానికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండతో కూడా మాట్లాడ్డానికి కూడా ప్రయత్నించిందట అనసూయ. కాకపోతే పీఆర్ వ్యవస్థల వల్ల అది సాధ్యం కాలేదని, తనకు ఎలాంటి పీఆర్ లేరని స్పష్టం చేసింది.

మొత్తమ్మీద అనసూయ ప్రకటనతో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదం సమసిపోయినట్టయింది. తాజా వివాదం తన వ్యక్తిత్వంపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఇంతకుముందు తను 'నో ఫిల్టర్'గా ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలానే ఉంటానని స్పష్టం చేసింది అనసూయ.