సర్కారు వారి పాట..ఏం జ‌రుగుతోంది?

మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమా వ్యవహారం ఆది నుంచీ గందరగోళంగానే వుంది. లీకులు వగైరా సంగతులు ఒకపక్క. స్క్రిప్ట్ సరిగ్గా రాలేదని, సెకండాఫ్ మళ్లీ వండుతున్నారనే…

మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమా వ్యవహారం ఆది నుంచీ గందరగోళంగానే వుంది. లీకులు వగైరా సంగతులు ఒకపక్క. స్క్రిప్ట్ సరిగ్గా రాలేదని, సెకండాఫ్ మళ్లీ వండుతున్నారనే వార్తలు ఇంకోపక్క వినవస్తూనే వున్నాయి. 

రెండు నెలల క్రితం నుంచి ఈ గ్యాసిప్ లు వినిపించడం గట్టిగా మొదలైంది. అప్పటి వరకు జ‌రిగిన షూటింగ్ పరిస్థితి సమీక్షించి తొలిసారిగా మహేష్ డైరక్టర్ మీద చాలా సీరియస్ అయ్యాడని వార్తలు వినిపించాయి. 

స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసి కానీ తనకు కనిపించవద్దని డైరక్టర్ ను ఆదేశించాడని టాక్ వచ్చింది. ఈలోగా ఫైటింగ్ సీన్లు తాను చేసుకుంటా అని, డైరక్టర్ లేకుండానే చేసుకున్నారని వినిపించింది.

ఆ తరువాత మళ్లీ షూట్ ప్రారంభమైనంది. ఈ లోగా కొత్త టీమ్ ను సెట్ చేసుకుని పరుశురామ్ సినిమా స్క్రిప్ట్ ను చక్కదిద్దుతున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అక్కడ నుంచి మరింత ముందుకు వెళ్లి, సెట్ లో డైరక్టర్ కనిపిస్తే చాలు హీరో చిరాకు పడుతున్నారనే గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.

ఇవన్నీ ఒక ఎత్తు లేటెస్ట్ గా డైరక్టర్ ను మహేష్ బాబు చాలా గట్టిగా మందలించాడని, చాలా కోప్పడ్డారని ఈ రోజు ఇండస్ట్రీలో స్ప్రెడ్ కావడం ప్రారంభమైంది. మొత్తం మీద సర్కారు వారి పాట విషయంలో ఏదో జ‌రుగుతోంది. అదేంటో తెలియాల్సి వుంది.