ప్రియురాలిని ముక్కలుగా కోసి, కుక్కర్ లో ఉడికించి..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలో ముంబయిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి, మోజు తీరిన తర్వాత ఆమెను హత్య చేసి, ముక్కలుముక్కలుగా నరికి,…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలో ముంబయిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి, మోజు తీరిన తర్వాత ఆమెను హత్య చేసి, ముక్కలుముక్కలుగా నరికి, కుక్కర్ లో వేసి ఉడికించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ముంబయిలోని గీతానగర్ లో మనోజ్ సహానీ, సరస్వతి వైద్య సహజీవనం చేస్తున్నారు. కొన్నేళ్లు బాగానే ఉన్నారు. అయితే ఈమధ్య కాలంలో మనోజ్-సరస్వతి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఒక్కోసారి రోజంతా గొడవపడేవారని చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు చెబుతున్నారు. రీసెంట్ గా కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆ క్షణికావేశంలో సరస్వతిని కొట్టిచంపాడు మనోజ్. హత్య కేసు బయటకు రాకుండా ఉండేందుకు, సరస్వతి మృతదేహాన్ని ముక్కలుముక్కలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం చెట్లు నరికే కట్టర్ ను కొనుగోలు చేశాడు. ఆ కట్టర్ సహాయంతో చాలా ముక్కలు చేశాడు.

అయితే ఆ ముక్కల్ని బయటకు విసిరేస్తే, శ్రద్ధావాకర్ కేసు టైపులో తను కూడా దొరికిపోతానని భావించాడు మనోజ్. సరిగ్గా ఇక్కడే మరో ఆలోచన చేశాడు. కట్ చేసిన శరీరభాగాల్ని ఉడికించి, ఆ తర్వాత వాటిని కవర్ లో చుట్టి బయట పడేస్తే ఎవ్వరికీ అనుమానం రాదని భావించాడు.

అనుకున్నదే తడవుగా ఓ పెద్ద కుక్కర్ కొన్నాడు. అందులో సరస్వతి డెడ్ బాడీ శరీర భాగాల్ని వేసి ఉడికించడం మొదలుపెట్టారు. 2 రోజులు బాగానే నడిచింది. మూడో రోజు నుంచి ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఉంటున్న వాళ్లకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫ్లాట్ డోర్ తెరిచిచూసి షాకయ్యారు. సగం ఉడికించిన శరీరభాగాలతో పాటు, మరికొంత భాగం మృతదేహాన్ని కనుగొన్నారు. మనోజ్ తో పాటు మరో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.