విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి!

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కేరళలోని త్రిసూర్ సమీపంలో ఇవాళ ఉద‌యం జరిగిన కారు ప్రమాదంలో ప్రముఖ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(39) మృతి చెందారు.  Advertisement సుధీ.. అతని బృందం…

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కేరళలోని త్రిసూర్ సమీపంలో ఇవాళ ఉద‌యం జరిగిన కారు ప్రమాదంలో ప్రముఖ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(39) మృతి చెందారు. 

సుధీ.. అతని బృందం ఆదివారం వటకరాలో జరిగిన ఒక ఈవెంట్ ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా కైపమంగళం వద్ద వారి కారు అదుపుత‌ప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధీ తలకు బలమైన గాయం కావడంతో.. సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

39 ఏళ్ల సుధీ స్టేజ్ షోల నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఎదిగారు..  2015లో కంఠారి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా కుట్టనాదన్ మార్ప్పప్ప, కేసు ఈ వీడింటే నాధన్, ఎస్కేప్, స్వర్గతిలే కత్తురుంబు కొల్లం వంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.