ఈ నెల 14 నుంచి జనసేనాని పవన్కల్యాణ్ మొదలు పెట్టనున్న వారాహి యాత్రపై ఆయన వ్యతిరేకులు సోషల్ మీడియాలో తీవ్రంగా సెటైర్స్ విసురుతున్నారు. అది వారాహి కాదు… నారాహి అంటూ అందుకు తగ్గట్టు వాహనాన్ని పసుపుమయం చేసి, లోకేశ్, చంద్రబాబు ఫొటోలతో నింపేయడం విశేషం. ఆ వాహనం పక్కన పవన్కల్యాణ్ నిల్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే సందర్భంలో పవన్కల్యాణ్ను జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ అడుగుతున్నట్టుగా సంభాషణ సైతం ఆలోచింపజేస్తోంది. “యాత్రకు వచ్చేటప్పుడు జనసేన జెండా తెచ్చుకోవాలా? టీడీపీ జెండా తెచ్చుకోవాలా? అని మన పిల్ల సైనిక్స్ అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు?” అని పవన్ను నాదెండ్ల అడుగుతున్నట్టుగా ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎప్పుడో మొదలు కావాల్సిన వారాహి యాత్ర… లోకేశ్ కోసం ఇంత కాలం పవన్ నిలిపేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును సీఎం చేసే లక్ష్యంతో పవన్ వారాహి యాత్ర స్టార్ట్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ను బద్నాం చేసే క్రమంలో ఆయన ప్రత్యర్థులు సృజనాత్మక పోస్టులతో జనసేనను చితక్కొడుతున్నారు. ఇందుకు దీటైన కౌంటర్లు జనసేన నుంచి కొరవడ్డాయి.
ఎందుకంటే పవన్కల్యాణ్లో తాను సీఎం కావాలన్న పట్టుదల లేకపోవడమే. కేవలం వైసీపీని గద్దె దించే లక్ష్యంతో పవన్ రాజకీయ అడుగులు వుండడం జనసేనకు డ్యామేజీ చేస్తోంది. తాజాగా వారాహి యాత్ర మొదలు కాకుండానే దానిపై తీవ్రస్థాయిలో ఎటాక్ జరుగుతోంది. ఇక మొదలై, పవన్ ఏది పడితే అది మాట్లాడితే, ప్రత్యర్థుల నుంచి తప్పక దీటైన కౌంటర్లు వస్తాయి. అప్పుడు మరింతగా రాజకీయ మజా వుంటుందని చెప్పక తప్పదు.