అర్జున్రెడ్డి సినిమాతో సంచలనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ వంగా అదే కథతో బాలీవుడ్లో కబీర్ సింగ్ తీసి ఏకంగా మూడొందల కోట్లు కొల్లగొట్టాడు.
తదుపరి చిత్రాన్ని బాలీవుడ్లోనే ప్లాన్ చేస్తే రణభీర్ కపూర్ ఓకే చేసి కూడా జెల్ల కొట్టాడు. ఆ కథను తీసుకుని సందీప్ మన సూపర్స్టార్లు చాలా మందిని సంప్రదించాడు.
మహేష్, ప్రభాస్ లాంటి సూపర్స్టార్లు ఎందుకో ఆ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపించలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా చేద్దామని సందీప్ ఎంతగా ట్రై చేసినా మన హీరోలు ముందుకు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్లోనే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు.
ఈ లాక్డౌన్లో ఏమనుకున్నాడో తెలియదు కానీ రణభీర్ కపూర్ ఆ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. రణ్భీర్ కపూర్ ఓకే చేసాడంటే కచ్చితంగా ఆ కథలో ప్రత్యేకత వుందని అర్థమవుతోంది.
మరి మన తెలుగు హీరోలకు ఆ కథ ఎందుకు నచ్చలేదో తెలీదు. ఒకవేళ ఇదీ కబీర్ సింగ్లా సంచలనమయితే కనుక అటు పాన్ ఇండియా కథ మిస్ చేసుకోవడమే కాదు, సందీప్ వంగా లాంటి దర్శకుడిని టాలీవుడ్ కూడా మిస్ చేసుకున్నట్టవుతుంది.