మన సూపర్‌స్టార్లు రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్

అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ వంగా అదే కథతో బాలీవుడ్‌లో కబీర్ సింగ్ తీసి ఏకంగా మూడొందల కోట్లు కొల్లగొట్టాడు.  Advertisement తదుపరి చిత్రాన్ని బాలీవుడ్‌లోనే ప్లాన్ చేస్తే రణభీర్…

అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ వంగా అదే కథతో బాలీవుడ్‌లో కబీర్ సింగ్ తీసి ఏకంగా మూడొందల కోట్లు కొల్లగొట్టాడు. 

తదుపరి చిత్రాన్ని బాలీవుడ్‌లోనే ప్లాన్ చేస్తే రణభీర్ కపూర్ ఓకే చేసి కూడా జెల్ల కొట్టాడు. ఆ కథను తీసుకుని సందీప్ మన సూపర్‌స్టార్లు చాలా మందిని సంప్రదించాడు.

మహేష్, ప్రభాస్ లాంటి సూపర్‌స్టార్లు ఎందుకో ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా చేద్దామని సందీప్ ఎంతగా ట్రై చేసినా మన హీరోలు ముందుకు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌లోనే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. 

ఈ లాక్‌డౌన్‌లో ఏమనుకున్నాడో తెలియదు కానీ రణభీర్ కపూర్ ఆ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. రణ్‌భీర్ కపూర్ ఓకే చేసాడంటే కచ్చితంగా ఆ కథలో ప్రత్యేకత వుందని అర్థమవుతోంది. 

మరి మన తెలుగు హీరోలకు ఆ కథ ఎందుకు నచ్చలేదో తెలీదు. ఒకవేళ ఇదీ కబీర్ సింగ్‌లా సంచలనమయితే కనుక అటు పాన్ ఇండియా కథ మిస్ చేసుకోవడమే కాదు, సందీప్ వంగా లాంటి దర్శకుడిని టాలీవుడ్ కూడా మిస్ చేసుకున్నట్టవుతుంది.

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు