జ‌గ‌న్‌ను ఫిదా చేసిన రోజా ప్ర‌సంగం

ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీ నేత‌ల బాగోతాల‌ను వైసీపీ ఫైర్‌బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా బ‌హిరంగ స‌భా వేదిక మీదుగా ఏక‌రువు పెట్టారు. మ‌హిళ‌ల విష‌యంలో టీడీపీ ముఖ్య నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో ఆమె…

ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీ నేత‌ల బాగోతాల‌ను వైసీపీ ఫైర్‌బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా బ‌హిరంగ స‌భా వేదిక మీదుగా ఏక‌రువు పెట్టారు. మ‌హిళ‌ల విష‌యంలో టీడీపీ ముఖ్య నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో ఆమె చెప్పుకొచ్చారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆమె టీడీపీ నేత‌ల‌పై చెలరేగిపోయారు. అస‌లే రోజా, వేదికపై మ‌హిళా ప్ర‌ముఖులు, వేదిక ముందు వేలాదిగా హాజ‌రైన మ‌హిళ‌లు.

టీడీపీ త‌న‌యుడు లోకేశ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నా యుడిపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి ఇంత‌కంటే మంచి త‌రుణం రాద‌ని ఆమె దూకుడు ప్ర‌ద‌ర్శించారు. మ‌హిళ‌లు జై జ‌గ‌న్ అంటే నారావారి క‌ర్ణ‌భేరీల్లో రీసౌండ్ రావాలంటూ రోజా పిలుపునిచ్చారు. తన 20 సంవత్సరాల‌ రాజకీయ జీవితంలో ఈ రోజు ఆనందం గా మాట్లాడుతున్న‌ట్టు రోజా ప్ర‌క‌టించ‌డం విశేషం.

జ‌గ‌న్‌లాంటి మ‌హిళా ప‌క్ష‌పాతి సీఎంను దేశంలో ఎక్క‌డా, ఎవ‌రూ చూసి ఉండ‌ర‌న్నారు. ఎంతో మంది నాయ‌కుల‌కు చేత‌కాని మ‌హిళా సాధికార‌త‌ను సీఎం జ‌గ‌న్ చేసి చూపించార‌ని ప్ర‌శంసించారు. గ‌తంలో మ‌హిళ‌లు పోలీసుల దెబ్బలు తినేవార‌న్నారు. ఏ మహిళా‌ సంఘం పోరాడకుండా మహిళలకు పట్టం కట్టారని ఆమె గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. 

మ‌హిళ‌లంద‌రికీ దాదాపు రూ.80వేల కోట్ల రూపాయ‌లు అంద‌జేసిన‌ మహిళా సంక్షేమ మహా చక్రవర్తి సీఎం జగన్ అని ఆకాశ‌మే హ‌ద్దుగా రోజా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వైసీపీలో మ‌హిళా ఎమ్మెల్యేగా ఉన్నందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. చంద్ర‌బాబు, లోకేశ్‌, టీడీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ గురించి మాట్లాడే అర్హ‌త ఉందా? అని రోజా ప్ర‌శ్నించారు. మూడేళ్ల క్రితం ఐదేళ్ల నారావారి న‌ర‌కాసుర పాల‌న ఎలా ఉంటుందో అంద‌రూ గ‌మ‌నించార‌ని తెలిపారు.

టీడీపీ అంటే తెలుగు దుశ్శాస‌న పార్టీ అని రోజా కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. ఎందుకంటే ఆ పార్టీలో బుద్ధి మంద‌గించిన చంద్ర‌బాబు మొద‌లుకుని బుద్ధి లేని బుద్దా వెంక‌న్న వ‌ర‌కూ అంద‌రూ మ‌హిళా వ్య‌తిరేకులే ఉన్నార‌ని విరుచుకుప‌డ్డారు.

చంద్ర‌బాబు చీట‌ర్‌, జ‌గ‌న్ లీడ‌ర్ అని పంచ్‌ల‌తో అద‌ర‌గొట్టారు. లోకేష్ ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో మహిళలతో డేన్స్ లేశార‌ని విమ‌ర్శించారు. లోకేష్ పీఏ మహిళలను వేధించార‌ని గుర్తు చేశారు. దేవినేని ఉమ తన పదవి కోసం వదినని చంపార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే మ‌హిళా ఎమ్మార్వో వ‌న‌జాక్షిని ఇసుక‌లో వేసి కొట్టిన చింత‌మనేని ప్ర‌భాక‌ర్‌ను చూశామ‌న్నారు. బోండా ఉమ తల్లీబిడ్డ‌ని కొట్ట‌డం ఇదే విజ‌య‌వాడ‌లో చూశామ‌ని మండిప‌డ్డారు.

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహిళను బూటు కాలితో తన్నాడ‌ని త‌ప్పు ప‌ట్టారు. 160 సీట్లతో టీడీపీ గెలుస్తుందని అచ్చన్న జోకేశాడ‌ని పంచ్ వేశారు. అలాగే గ‌ట్టి చ‌ట్నీ తింటే అచ్చెన్న 160 కిలోల బ‌రువు పెరుగుతాడే త‌ప్ప‌, చంద్ర‌బాబుతో క‌లిసి త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా 160 సీట్లు రావ‌ని సెటైర్ వేశారు. 

ఎవ‌డు ప‌డితే వాడు వ‌చ్చి ఓడిస్తానంటే ఊరుకోడానికి బిడ్డా…ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్డా, జ‌గ‌న్ అన్న అడ్డా అని నిన‌దించారు. ఎవ‌రు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయ‌నే మ‌న జ‌గ‌న‌న్న అని సినీ డైలాగ్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇలా త‌న ప్ర‌సంగంతో సీఎం జ‌గ‌న్‌ను రోజా ఫిదా చేశారు.