ప్రభాస్ తో పీపుల్స్ మీడియా ‘స్పిరిట్’

హీరో ప్రభాస్ తో ఓ సారి పరిచయం అయితే ఎవరైనా కనెక్ట్ అయిపోతారు. అది యువి అయినా కావచ్చు, టీ సిరీస్ అయినా కావచ్చు. ఇప్పుడు ఈ స్నేహ బృందంలో పీపుల్స్ మీడియా సంస్థ…

హీరో ప్రభాస్ తో ఓ సారి పరిచయం అయితే ఎవరైనా కనెక్ట్ అయిపోతారు. అది యువి అయినా కావచ్చు, టీ సిరీస్ అయినా కావచ్చు. ఇప్పుడు ఈ స్నేహ బృందంలో పీపుల్స్ మీడియా సంస్థ కూడా చేరిపోయింది. 

నిర్మాత దానయ్య వద్దనుకున్న మారుతి దర్శకత్వంలోని ప్రాజెక్ట్ ను తాను తీసుకున్నపుడే ప్రభాస్ అభిమాన బృందంలో ప్లేస్ దొరికింది. ఇప్పుడు మరో రెండు డీల్స్ సెట్ చేసుకుని ఆ ప్లేస్ ను పర్మనెంట్ చేసేసుకుంది.

విషయం ఏమిటంటే టి సిరీస్-యువి కలిపి నిర్మించే స్పిరిట్ సినిమాను పీపుల్స్ మీడియా టేకోవర్ చేస్తోంది. ఇకపై ఈ సినిమాలో యువి సినిమాస్ కు భాగస్వామ్యం వుండదు. నిర్మాతలుగా టి సిరీస్-పీపుల్స్ మీడియా మాత్రమే వుంటాయి. ఈ మేరకు యువి సంస్థ తన వాటాను కాస్త గుడ్ విల్ కు విక్రయించేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల తరువాత ప్రభాస్ తరువాత బ్యాచ్ ఆఫ్ మూవీస్ మీదకు వెళ్తారు. వాటిలో స్పిరిట్ కూడా ఒకటి. పీపుల్స్ మీడియా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో భారీ సినిమాలు నిర్మిస్తోంది.