పాన్ ఇండియా అప్పీల్ కోసం నన్ను తీసుకోలేదు: భాగ్యశ్రీ

రాధేశ్యామ్ సినిమాతో సౌత్ లోకి ఎంటరవుతోంది సీనియర్ నటి భాగ్యశ్రీ. ఇంతకీ ఈ సినిమాలో ఈమెను ఎందుకు తీసుకున్నారు? ప్రభాస్ తల్లి పాత్ర కోసం భాగ్యశ్రీని మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటి? కేవలం పాన్…

రాధేశ్యామ్ సినిమాతో సౌత్ లోకి ఎంటరవుతోంది సీనియర్ నటి భాగ్యశ్రీ. ఇంతకీ ఈ సినిమాలో ఈమెను ఎందుకు తీసుకున్నారు? ప్రభాస్ తల్లి పాత్ర కోసం భాగ్యశ్రీని మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటి? కేవలం పాన్ ఇండియా అప్పీల్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఈ ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది భాగ్యశ్రీ. తను రాధేశ్యామ్ ప్రాజెక్టు అంగీకరించడానికి అసలు కారణాన్ని బయటపెట్టింది.

“యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ ఉంది. డైరక్టర్ రాధ చాలా బాగా చెప్పాడు. ఇక హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. వీటితో పాటు నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి బలమైన కారణం ఇంకోటి ఉంది. ఈ పాత్ర నాకు చాలా ఛాలెంజింగ్. నేను మంచి డాన్సర్ ను కాదు. ఈ సినిమాలో నేను డాన్స్ చేశాను. ఈ కథ అలాంటిది. అందుకే నేను అంగీకరించాను.”

ఇలా రాధేశ్యామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టింది భాగ్యశ్రీ. మొదటి రోజు సెట్స్ లో ప్రభాస్ ను కలిసినప్పుడు, ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచించానని, కానీ సెట్స్ పైకి వచ్చిన వెంటనే ప్రభాసే తననుతాను పరిచయం చేసుకొని, చిన్నప్పటి ఫ్యాన్ అని కూడా చెప్పడంతో తను చాలా షాక్ అయ్యానని తెలిపింది భాగ్యశ్రీ.

ఈనెల 11న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది రాధేశ్యామ్ సినిమా. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.