కొత్తకాన్పెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పోలిమేర. ఈ చిత్రం ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మా ఊరి పోలిమేరకు సీక్వెల్ గా రాబోతున్న చిత్రం ‘మా ఊరి పోలిమేర 2”. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం నవంబరు 3న విడుదల కాబోతోంది. ఈ చిత్ర హక్కులను వంశీ నందిపాటి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా పంపిణీదారు వంశీ నందిపాటి మాట్లాడుతూ…“గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర-2` చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండబోతుంది.
ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక సంఘటనలను ఈ చిత్రంలో జోడించారు. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా వుంటుంది. వాట్ నెక్ట్స్ అనేది ఎవరూ ఊహించలేరు. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్ లో షూటింగ్ చేశారు అని వివరించారు.
ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఫైట్ మాస్టర్ః రామ్ మాస్టర్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్.