మిగిలిన ఆ ఒక్క పని చేసేస్తా: శృతిహాసన్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్, తనకు ఎదురయ్యే ప్రశ్నలపై కూడా అంతే బోల్డ్ గా స్పందిస్తుంది. తన శారీరక, మానసిక సమస్యల్ని సైతం బయటపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే తన మనసును…

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్, తనకు ఎదురయ్యే ప్రశ్నలపై కూడా అంతే బోల్డ్ గా స్పందిస్తుంది. తన శారీరక, మానసిక సమస్యల్ని సైతం బయటపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే తన మనసును ఆవిష్కరించింది. ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాల్ని బయటపెట్టింది. ఇప్పుడు తాజాగా మరో అంశాన్ని కూడా బయటపెట్టింది.

ఆన్ లైన్ లో చాలా యాప్స్ ట్రై చేసిన శృతిహాసన్ డేటింగ్ యాప్స్ మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదంట. తను ఫేమస్ అవ్వడం వల్ల డేటింగ్ యాప్స్ ఓపెన్ చేయలేకపోతున్నానని, లేదంటే చాలామందిలా తనకు కూడా బ్లయిండ్ డేట్ చేయడం ఇష్టమని చెప్పుకొచ్చింది.

“డేటింగ్ యాప్స్ పై చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పటివరకు నేను వాటిని ట్రై చేయలేదు. నేను ఫేమస్ కావడం వల్ల ఆ యాప్స్ లో అడుగు పెట్టలేకపోయాను. నా ఫ్రెండ్స్ అంతా ఆ యాప్స్ వాడుతున్నారు. ఎడమ-కుడి వైపులకు స్వైప్ చేస్తూ, వ్యక్తుల్ని తిరస్కరించడం, అంగీకరించడం చేస్తున్నారు. బ్లయిండ్ డేట్స్ కు వెళ్తున్నారు. నేను ఆ పని మాత్రం చేయలేకపోతున్నాను.”

ఒకవేళ తను అంతగా ఫేమస్ అవ్వకపోయి ఉండుంటే, కచ్చితంగా ఈపాటికి డేటింగ్ యాప్స్ లో ఉండేదాన్నని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇలాంటి యాప్స్ ను తను నమ్మనని, కానీ సరదాగా ఉండడం వల్ల ప్రయత్నించాలని అనుకుంటున్నట్టు తెలిపింది.

రీసెంట్ గా కరోనా బారిన పడింది శృతిహాసన్. తనకు పాజిటివ్ నిర్థారణ అయినట్టు ఈరోజు ఆమె ప్రకటించింది. ప్రస్తుతం మందులు తీసుకుంటున్నానని, త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వస్తానని ఆమె ప్రకటించింది. తను నటించిన వెబ్ సిరీస్ కు ప్రచారంలో భాగంగా ఈమధ్య ఎక్కువగా బయట తిరిగింది శృతిహాసన్. అలా తనకు కరోనా సోకి ఉంటుందని శృతిహాసన్ భావిస్తోంది.