ఎకె రీమేక్..రానా ఫిక్స్

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో ఎవరు మారినా, రానా మాత్రం ఈ ప్రాజెక్టులో ఫిక్స్ అని ముందు నుంచి గ్రేట్ ఆంధ్ర చెబుతూనే వుంది. కానీ సాయి ధరమ్ తేజ్ నుంచి గోపీచంద్ వరకు…

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో ఎవరు మారినా, రానా మాత్రం ఈ ప్రాజెక్టులో ఫిక్స్ అని ముందు నుంచి గ్రేట్ ఆంధ్ర చెబుతూనే వుంది. కానీ సాయి ధరమ్ తేజ్ నుంచి గోపీచంద్ వరకు ఎవరికి తోచిన పేర్లు వాళ్లు రాసుకుంటూ పోయారు. 

కానీ ఇప్పుడు రానా పేరు అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. రెండు రోజల కిందటే రానాకు ఫుల్ అండ్ ఫైనల్ నెరేషన్ ఇచ్చేయడం, అంతా ఓకె అయిపోవడం జరిగిపోయింది.

నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఈ విషయం ప్రకటించబోతోంది. అంతే కాదు, పోలాచ్చిలో సింగిల్ షెడ్యూలులో ఈ సినిమా పూర్తి చేస్తారని అక్కడే పోలీస్ స్టేషన్ సెట్ కూడా వేస్తారని గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. 

ఈ మేరకు ఆర్ట్ డైరక్టర్ ప్రకాష్ త్వరలో పోలాచ్చి వెళ్లబోతున్నారు.జనవరి నుంచి పవన్, రానా ఎకె రీమేక్ మీదకు వచ్చే అవకాశం వుంది. 

ముందుగా అల్యూమినియం ఫ్యాకర్టీలో ఓ భారీ ఫైట్ చిత్రీకరించిన తరువాత పోలాచ్చికి షిఫ్ట్ అవుతారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న