విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మ‌నోబాల క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. త‌మిళ సినిమాల‌తో పాటు తెలుగు సినిమాల్లోను నటించి త‌న కామెడీతో…

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మ‌నోబాల క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. త‌మిళ సినిమాల‌తో పాటు తెలుగు సినిమాల్లోను నటించి త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. 

1970ల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోబాల.. 1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత దర్శకుడిగానూ 20కి పైగా చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.  తెలుగులో మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో ఆయన నటించారు.  

దాదాపు 350 పైగా సినిమాల్లో న‌టించిన ఆయ‌న‌.. దిగ్గజ నటులైన‌ కమల్‌ హాసన్‌, రజనీకాంత్. విజ‌య్ వంటి స్టార్స్ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.