ఎక్స్ క్లూజివ్-చైతూ విత్ చందూ

కార్తికేయ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రేమమ్ తో మలి హిట్ కొట్టి, సవ్యసాచితో డల్ అయినా, మళ్లీ కార్తికేయ 2 బౌన్స్ బ్యాక్ అయ్యాడు దర్శకుడు చందు మొండేటి. కార్తికేయ 2 తరువాత చందు…

కార్తికేయ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రేమమ్ తో మలి హిట్ కొట్టి, సవ్యసాచితో డల్ అయినా, మళ్లీ కార్తికేయ 2 బౌన్స్ బ్యాక్ అయ్యాడు దర్శకుడు చందు మొండేటి. కార్తికేయ 2 తరువాత చందు మొండేంటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. 

అయితే గీతా సంస్థలో ఓ సినిమా చేయాల్సి వుంది. పెద్ద హీరోల కోసం అక్కడ గాలింపు మొదలైంది. హిందీ హీరోలు, తమిళ హీరోలు అందరూ బిజీగానే వున్నారు. పాన్ ఇండియా సినిమా కొట్టాలి అంటే కొన్నాళ్లు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి.

నిర్మాత బన్నీ వాస్ ఈ లోగా ఓ మాంచి కథ తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ కథను ముందుగా చేసేస్తే పాన్ ఇండియా సినిమా సంగతి తరువాత చూసుకోవచ్చు అన్నది బన్నీ వాస్ ప్లాన్. ఇప్పుడు ఆఖరికి అదే ఫైనల్ అయింది. చందు మొండేటి-గీతాసంస్థ కలిసి హీరో నాగ్ చైతన్యను ఆ కథతో ఒప్పించినట్లు తెలుస్తోంది. 

ఇంకా ఫైనల్ డిస్కషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కస్టడీ ప్రొమోషన్లలో బిజీగా వున్న చైతూ వన్స్ ఫ్రీ అయితే డెసిషన్ తీసుకుంటారు. అప్పుడు అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. కచ్చితంగా ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ను క్రేజీగా చూస్తారు.