అలియా భట్ రాలేదని ముహూర్తం ఆపేశారట?

వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇదే నిజం అంటోంది కొరటాల యూనిట్. హీరో రానందుకు కాదు, హీరోయిన్ అలియా భట్ రానందుకు ఏకంగా సినిమా లాంఛ్ కార్యక్రమాన్ని వాయిదా వేశారంట. ఎన్టీఆర్-కొరటాల సినిమా మేటర్…

వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇదే నిజం అంటోంది కొరటాల యూనిట్. హీరో రానందుకు కాదు, హీరోయిన్ అలియా భట్ రానందుకు ఏకంగా సినిమా లాంఛ్ కార్యక్రమాన్ని వాయిదా వేశారంట. ఎన్టీఆర్-కొరటాల సినిమా మేటర్ ఇది.

వీళ్లిద్దరి కాంబోలో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగాలి. కానీ అలా జరగలేదు. దీనికి కారణం అలియాభట్ అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ను తీసుకున్నారు. ప్రాజెక్టుకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేందుకు అలియా భట్ ను తీసుకున్న మేకర్స్.. లాంఛింగ్ నుంచే అలియాను ఎలివేట్ చేయాలని అనుకున్నారు.

అలియా భట్ కూడా పూజా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అంగీకరించిందట. కానీ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల ఆఖరి నిమిషంలో రాలేకపోయిందట. అటు ఎన్టీఆర్ కూడా పూజా కార్యక్రమాలకు వచ్చే పరిస్థితి లేదంట. దీంతో ఈ సినిమా లాంఛింగ్ కు వాయిదా వేశారనేది టాక్.

త్వరలోనే మరో మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాకే అనిరుధ్ సంగీతం అందించాల్సింది. ఆ సినిమా ఓపెనింగ్ కు కూడా వచ్చాడు అనిరుధ్. కానీ అది కాస్తా మిస్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు తారక్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు. మిక్కిలినేని సుధాకర్, కల్యాణ్ రామ్ నిర్మాతలుగా ఈ సినిమా రాబోతోంది.