ప్రభాస్ నిజంగానే షాక్ ఇచ్చాడు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ప్రకటించాడు. ఇది షాక్ కాదు. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు ఒకటి ఉందని చాన్నాళ్లుగా నడుస్తోంది. మొన్నటికిమొన్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ పరోక్షంగా చెప్పింది.  Advertisement ఈరోజు…

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ప్రకటించాడు. ఇది షాక్ కాదు. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు ఒకటి ఉందని చాన్నాళ్లుగా నడుస్తోంది. మొన్నటికిమొన్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ పరోక్షంగా చెప్పింది. 

ఈరోజు అధికారికంగా ప్రకటన ఇచ్చింది. కానీ అన్నింటికంటే షాకింగ్ ఏంటంటే.. ఈ సినిమా వచ్చే నెల నుంచే సెట్స్ పైకి రాబోతోంది.

అవును.. సలార్ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభమౌతుందని స్వయంగా ప్రభాస్ ప్రకటించాడు. ఇది నిజంగా అందరికీ షాక్. ఎందుకంటే.. ఇప్పటికే ఈ హీరో 2 పెద్ద ప్రాజెక్టులు ఎనౌన్స్ చేశాడు. అవి సెట్స్ పైకి వస్తాయని ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూడో సినిమా ముందుగా వస్తుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

వరుస క్రమంలో చెప్పుకుంటే.. ముందుగా నాగ్ అశ్విన్ సినిమా ప్రకటన వచ్చింది. దీంతో రాధేశ్యామ్ తర్వాత అదే సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆదిపురుష్ ప్రకటన వచ్చింది. అప్పుడు అసలు రచ్చ మొదలైంది.

ఆదిపురుష్ ముందుగా సెట్స్ పైకి వస్తుందని కొందరు అంటే.. నాగ్ అశ్విన్ సినిమానే ముందుగా వస్తుందని మరికొందరన్నారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి రెండు సినిమాలకూ ప్రభాస్ కాల్షీట్లు ఇచ్చి, సైమల్టేనియస్ గా చేస్తాడని అన్నారు.

కట్ చేస్తే.. తాజాగా ప్రకటించిన సలార్ సినిమానే ముందుగా సెట్స్ పైకి రాబోతోందనే విషయం తేలింది. అంతేకాదు.. రాధేశ్యామ్ తర్వాత తమ సలార్ మూవీనే థియేటర్లలోకి వస్తుందని స్వయంగా హోంబలే ఫిలిమ్స్ నిర్మాతల్లో ఒకరైన విజయ్ కిరగందూర్ ప్రకటించడం విశేషం. 

మొత్తానికి రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ఏంటనే విషయంపై ఇన్నాళ్లకు ఓ స్పష్టత వచ్చిందనుకోవాలి.

కేసిఆర్ పాలన జగన్ కు ఓ పాఠం