మైత్రీ నవీన్ కు అస్వస్థత?

మైత్రీ మూవీస్ అధినేత, ప్ర‌ధాన భాగస్వామి నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది.  Advertisement గత రెండు రోజులుగా మైత్రీ మూవీస్ భాగస్వాముల ఇళ్లపై, ఆఫీసులపై, దర్శకుడు సకుమార్ ఇంటిపై ఇన్ కమ్ టాక్స్…

మైత్రీ మూవీస్ అధినేత, ప్ర‌ధాన భాగస్వామి నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. 

గత రెండు రోజులుగా మైత్రీ మూవీస్ భాగస్వాముల ఇళ్లపై, ఆఫీసులపై, దర్శకుడు సకుమార్ ఇంటిపై ఇన్ కమ్ టాక్స్ రెయిడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా నవీన్ కాస్త నలతగానే వుంటున్నారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ రెయిడ్స్ జరగడంతో నవీన్ కాస్త టెన్షన్ కు గురయినట్లు భోగట్టా.

వెంటనే ఆయనను నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఛాతీలో అనీజీగా వుండడంతో నగరంలో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె సంబంధిత పరీక్షలు అన్నీ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు డిశ్ఛార్జి చేస్తారని తెలుస్తోంది.

నవీన్ అమెరికాలో వుంటూ ఎనిమిదేళ్ల క్రితం తన మిత్రులు ఇద్దరితో కలిసి మైత్రీ మూవీస్ సంస్థను ప్రారంభించారు. భారీ బడ్జెట్ సినిమాలు, క్రేజీ కాంబినేషన్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్ లో ఈ బ్యానర్ పేరు మారుమోగింది.