అభిమాని పెళ్లి ప్రపోజల్.. భర్త, పిల్లలను అడిగి చెబుతానన్న నటి

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీస్ త‌మ ఫ్యాన్స్ కి నిత్యం అందుబాటులో ఉంటున్నారు. తమ సినిమాలకి సంబందించిన ముచ్చట్లు ఫ్యాన్స్ తో పంచుకుంటూ.. త‌మ ఫోటోలతో అభిమానులకి వినోదాన్ని అందిస్తుంటారు. అదే టైంలో…

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీస్ త‌మ ఫ్యాన్స్ కి నిత్యం అందుబాటులో ఉంటున్నారు. తమ సినిమాలకి సంబందించిన ముచ్చట్లు ఫ్యాన్స్ తో పంచుకుంటూ.. త‌మ ఫోటోలతో అభిమానులకి వినోదాన్ని అందిస్తుంటారు. అదే టైంలో కొన్ని సార్లు సోష‌ల్ మీడియా నుండి ట్రోలింగ్ లు, ల‌వ్ ప్ర‌పోజ‌ల్స్ కూడా వ‌స్తుంటారు. అలాంటి ప్రపోజల్ బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీకి వచ్చింది.

బాలీవుడ్ న‌టి, మోడ‌ల్ సెలీనా జైట్లీకి ఓ అభిమాని సోషల్ మీడియా వేదిక‌గా మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ చేశాడు. 'నా ఆరోగ్యం బాగాలేదు. న‌న్ను చూసుకోవ‌డానికి ఎవ‌రూ లేరు. నా ప‌రిస్థితి దిగ‌జార‌క‌ముందే న‌న్ను నీతో తీసుకెళ్లు. నీ కోసం ఇల్ల‌రికం రావ‌డానికి సిద్ధం' అని ట్వీట్ చేశాడు. దీనికి సెలీనా రిప్లై ఇస్తూ.. 'నా భర్త, ముగ్గురు పిల్ల‌ల‌ను అడిగి వ‌స్తాను' అని రీట్వీట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 

కాగా 2003లో మిస్ యూనివ‌ర్స్ ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన ఈమె ప‌లు బాలీవుడ్ చిత్రాల్లో న‌టించారు.  2003లో,  ఫిరోజ్ ఖాన్ యొక్క జనషీన్‌లో తన సినీ రంగ ప్రవేశం చేసింది.  2004లో వి. స‌ముద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూర్యం సినిమాలో మంచు విష్ణు స‌ర‌స‌న హీరోయిన్ గా చేసింది.