ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

ప్ర‌ముఖ బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ను చంపుతామంటూ కొంత‌మంది అజ్ఞాత వ్య‌క్తులు బెదిరిస్తున్న‌ట్టుగా స‌మాచారం. కేవ‌లం ప్ర‌కాష్ రాజ్ ను మాత్ర‌మే కాకుండా క‌ర్ణాట‌క‌లోని మ‌రి కొంద‌రు ప్ర‌ముఖుల‌కు కూడా ఇలాంటి హెచ్చ‌రిక‌లు…

ప్ర‌ముఖ బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ను చంపుతామంటూ కొంత‌మంది అజ్ఞాత వ్య‌క్తులు బెదిరిస్తున్న‌ట్టుగా స‌మాచారం. కేవ‌లం ప్ర‌కాష్ రాజ్ ను మాత్ర‌మే కాకుండా క‌ర్ణాట‌క‌లోని మ‌రి కొంద‌రు ప్ర‌ముఖుల‌కు కూడా ఇలాంటి హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయ‌ట‌. వారిలో నిజ‌గుణానంద స్వామీజీ కూడా ఉన్న‌ట్టుగా స‌మాచారం. క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామికి కూడా ఈ త‌ర‌హా హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయ‌ట‌. వీరంద‌రికీ ఒక జాయింటుగా ఒక లేఖ కూడా రాశార‌ట ఆ అజ్ఞాత వ్య‌క్తులు.

నిజ‌గుణానంద స్వామీజీ అనే కాషాయ ధారి ఈ మ‌ధ్య‌కాలంలో సంఘ్ ప‌రివార్ ను విమ‌ర్శిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాల‌ను ఆయ‌న వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. ఇక ప్ర‌కాష్ రాజ్ కూడా బీజేపీని, సంఘ్ ప‌రివార్ ను తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ ఉన్నారు. వారిపై త‌ర‌చూ ధ్వ‌జ‌మెత్తుతూ ఉంటారాయ‌న‌. త‌న గురుస‌మానురాలు అయిన గౌరీ లంకేష్ హ‌త్య స‌మ‌యం నుంచి ప్ర‌కాష్ రాజ్ తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తుతూ ఉన్నారు.

ఇక కుమార‌స్వామి ప్ర‌స్తుతానికి బీజేపీ వ్య‌తిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో వీరంద‌రికీ హెచ్చ‌రిక‌లు రావ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను చంపుతామంటూ కొంత‌మంది బెదిరిస్తున్నార‌ని కుమార‌స్వామి కూడా ప్ర‌క‌టించారు. అలాగే ఈ బెదిరింపుల నేప‌థ్యంలో అద‌న‌పు భ‌ద్ర‌త‌ను తిర‌స్క‌రించారు నిజ‌గుణానంద స్వామీజీ. 

క‌ర్ణాట‌క‌లో నాస్తికుల‌, హేతువాదుల హ‌త్య‌లు కొత్త కాదు. ఇది వ‌ర‌కూ అలాంటివి జ‌రిగాయి. గౌరీ లంకేష్ హ‌త్య కూడా అలాంటి వాటిల్లో ఒక‌టే. ఇలాంటి నేప‌థ్యంలో ఈ హెచ్చ‌రిక‌లు సంచ‌ల‌నం రేపుతూ ఉన్నాయి.

సైరా లాస్ ఎంత?

డబ్బులతో రాజకీయాలు చేసేవాళ్లం కాదు