మీ సరదా వైఎస్ జగన్ తీర్చేస్తారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. త‌న‌దైన పంచ్‌ల‌తో బాబును దెప్పి పొడిచారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ఆదివారం ఉద‌యం ఆమె వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యంలో ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆమె మీడియాతో…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. త‌న‌దైన పంచ్‌ల‌తో బాబును దెప్పి పొడిచారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ఆదివారం ఉద‌యం ఆమె వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యంలో ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. కుప్పంలో చంద్ర‌బాబు ప‌రిస్థితి చేతులు కాలాక‌ ఆకులు పట్టుకున్న చంద‌మైంద‌న్నారు. కుప్పం చుట్టు గిరగిరా తిరుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

14 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేసిన వ్య‌క్తి, తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీసం మంచినీటి సౌక‌ర్యం కూడా క‌ల్పించ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా చంద్రబాబుకు కుప్పంలో ఇల్లుకట్టుకోవాలనే ఆలోచన వచ్చిందంటే.. ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారని అర్థం అవుతుందన్నారు. చంద్రబాబుకు నెత్తిన ఉన్న కళ్లు కిందికి దిగాయని రోజా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.  

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారాన్ని ఆమె తిప్పి కొట్టారు. ఆ ప్ర‌చారం చేస్తున్న చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాలు ఏంటో తెలుసుకోవాల‌ని హిత‌వు చెప్పారు. చంద్ర‌బాబుకు ఎన్నిక‌లే కావాలంటే కుప్పంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి పోటీకి సిద్ధం కావాల‌ని రోజా స‌వాల్ విసిరారు. 

అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు సరదాగా ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రావాల‌ని..  మీ సరదా వైఎస్ జగన్ తీర్చేస్తాడని రోజా పంచ్ విసిరారు. ఎన్నిక‌లు ఏవైనా అంతిమ విజ‌యం వైసీపీదే అని ఆమె స్ప‌ష్టం చేశారు.