టాలీవుడ్ ను చుట్టేస్తోంది

కరోనా మూడో దశ హైదరాబాద్ లో విజృంభిస్తోంది. మంచు లక్ష్మి, మంచు మనోజ్ ల తరువాత హీరో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. ఆయన దుబాయ్ వెళ్లి కొన్నాళ్లు వుండి వచ్చారు.  Advertisement…

కరోనా మూడో దశ హైదరాబాద్ లో విజృంభిస్తోంది. మంచు లక్ష్మి, మంచు మనోజ్ ల తరువాత హీరో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. ఆయన దుబాయ్ వెళ్లి కొన్నాళ్లు వుండి వచ్చారు. 

ఇదిలా వుంటే మ్యూజిక్ డైరక్టర్ థమన్ కూ పాజిటివ్ వచ్చింది. నిజానికి థమన్ కోవిడ్ మీద తీసుకున్నన్ని జాగ్రత్తలు ఎవ్వరూ తీసుకుని వుండరు. ఎవ్వరైనా కలవడానికి వెళ్తే, వాళ్ల మాస్క్ లు తీసేయించి, ఆయన ప్రత్యేకమైన మాస్క్ లు ఇచ్చేవారు. ఎయిర్ ప్యూరిఫైయ్యర్లు, శానిటైజ‌ర్లు, మందులు ఇలా ఒకటి కాదు..ఎన్నో. అంతే కాదు. ఆయన ప్రత్యేకంగా అన్నీ తెప్పించి ఇండస్ట్రీ జ‌నాలకు పంచేవారు. ఇప్పుడు ఆయనకే పాజిటివ్ వచ్చింది.

ధమన్ కూడా దుబాయ్ వెళ్లి వచ్చారు. అక్కడ హీరో మహేష్ బాబును కలిసారు. మహేష్ బాబు వదిన శిల్ప శిరోద్కర్ కు ముందుగా పాజిటివ్ వచ్చింది. తరువాత మహేష్ కు, ఇప్పుడు థమన్ కు. అలాగే థమన్ అసిస్టెంట్ కూడా పాజిటివ్ అని తెలుస్తోంది. థమన్ అర్జెంట్ గా డిజె టుల్లు రీ రికార్డింగ్ చేయాల్సి వంది. ఆపై మిక్సింగ్ పనులు చూడాలి. అవన్నీ ఆగిపోయాయి.

నిర్మాత లగడపాటి శ్రీధర్, ఆయన భార్య శిరీష, కుమారుడు విక్రమ్ కు కూడా పాజిటివ్ అని తెలుస్తోంది. విక్రమ్ న్యూఇయర్ పార్టీకి వెళ్లడంతో కరోనా సోకినట్లు తెలుస్తోంది. డిజైనర్ అనిల్ భాను కూడా పాజిటివ్ వచ్చింది.  ఇండస్ట్రీలో ఎవర్ని కదిలించినా కరోనా వార్తలే వినిపిస్తున్నాయి.