దేవిశ్రీ రిజల్ట్ స్టేజ్ పైనే తెలిసిపోయింది

సరిలేరు నీకెవ్వరు సినిమా పాటలు తేలిపోయాయి, ఈ మాటంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతెత్తున ఎగిరిపడతారు, ట్రోలింగ్స్ మొదలు పెడతారు. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది వాస్తవం, ఈ వాస్తవానికి నిదర్శనమే సరిలేరు నీకెవ్వరు…

సరిలేరు నీకెవ్వరు సినిమా పాటలు తేలిపోయాయి, ఈ మాటంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతెత్తున ఎగిరిపడతారు, ట్రోలింగ్స్ మొదలు పెడతారు. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది వాస్తవం, ఈ వాస్తవానికి నిదర్శనమే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్. మెగాస్టార్ ముఖ్య అతిథిగా అదిరిపోయే రేంజ్ లో జరిగిన ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని తలుచుకున్న నాథుడే లేడు.

ఫంక్షన్ కి ముందు పర్ఫామెన్స్ ల వరకే పరిమితమైన దేవిశ్రీని ఆ తర్వాత మాట్లాడినవారెవరూ పెద్దగా అభినందించలేదు. ఆఖరికి హీరో మహేష్ బాబు కూడా అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పి, మ్యూజిక్ డైరెక్టర్ ని మర్చిపోయారు. చివర్లో ఆ.. మర్చిపోయాను అంటూ గుర్తు చేసి మరీ దేవిశ్రీని హత్తుకున్నారు. ఇదేదో తేడాగా ఉందని జనాలు అక్కడికక్కడే గుసగుసలాడుకున్నారు.

అంత పెద్ద సినిమాకు, అందులోనూ సంక్రాంతికి ఫుల్ కాంపిటీషన్ మధ్య విడుదల కాబోతున్న సినిమాకు దేవి తేలిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అటు అలవైకుంఠపురంతో పోల్చుకుంటే సరిలేరు ఆడియో పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి. ఐటమ్ సాంగ్ అయినా ఆకట్టుకుంటుంది అని ఆఖరివరకు వెయిట్ చేసినా అదీ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో దేవిపై మహేష్ సహా దర్శక నిర్మాతలు కాస్త కోపంగానే ఉన్నారని తెలుస్తోంది. ఈ ఫంక్షన్ లో ఆ విషయం స్పష్టంగా బైటపడింది.

ఆడియో హిట్ అయ్యుంటే.. కచ్చితంగా దేవి హైలెట్ అయ్యేవాడు. పొగిడిందే పొగిడి మహేష్ బాబు తెగ ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు, కాకతాళీయమో లేక కావాలనే ఇగ్నోర్ చేశారో తెలియదు కానీ, మహేష్ ఇచ్చిన షాక్ తో దేవిశ్రీ ఫీలయ్యాడు. క్యాచీ ట్యూన్స్ లేకపోవడంతో ఈ ఫంక్షన్ కి కేవలం స్పీచ్ లే హైలెట్ గా నిలిచాయి. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి టేకింగ్ నే అందరూ మెచ్చుకున్నారు. ఒకరకంగా దేవికి ఇలాంటి అనుభవం ఇదే ఫస్ట్ టైమ్. అన్నట్టు ట్రయిలర్ లో కూడా దేవిశ్రీ పాటలకు స్థానం దక్కలేదు.